ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ రోజు నిర్వహించిన శాసనసభా పక్ష సమావేశాంలో ఆయనను బీజేఎల్పీ నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. దీంతో ఆయన ఒడిశా తొలి బీజేపీ ముఖ్యమంత్రి కానున్నారు. కేవీ సింగ్ డియో, ప్రభాతి పరిదా ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారు. కేంద్రంలో ప్రధాని, మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడంతో ఒడిశాలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఈ రోజు ఆ రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లో బీజేఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, భూపిందర్ యాదవ్ పరిశీలకులుగా హాజరయ్యారు.
పూర్తిగా చదవండి..Odisha new CM: ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ!
ఒడిశా కొత్త ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై సస్పెన్స్ వీడింది. సీనియర్ నేత, మోహన్ చరణ్ మాఝీగాను బీజేపీ హైకమాండ్ సీఎంగా ఎంపిక చేసింది. దీంతో ఈ రోజు ఆయనను ఎమ్మెల్యేలు బీజేఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రేపు ఆయన ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.
Translate this News: