గత నెల నుంచి మణిపూర్లో కొనసాగుతున్న హింసాకాండ ఆగడం లేదు. ఈరోజు కూడా చెదురుమదురు సంఘటనలు సంభవించాయి. ఘర్షణలు రోజురోజుకూ తీవ్రమవతున్న నేపథ్యంలో సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేసే అవకాశం ఉనట్లు తెలుస్తోంది. రాష్ట్ర సీఎం బీరెన్ సింగ్ నేడు ఆ రాష్ట్ర గవర్నర్ అనుసూయా ఉకేతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బీరెన్ సింగ్ గవర్నర్ తో భేటీ కానున్నారు. మణిపూర్ లో జాతీ ఘర్షణల మధ్య శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్న నేపథ్యంలో బీరెన్ సింగ్ తన రాజీనామాను సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు గవర్నర్ కు తన రాజీనామా లేఖను అందజేయనున్నట్లు మణిపూర్ వర్గాలు వెల్లడించాయి.
పూర్తిగా చదవండి..హింసాకాండ నేపథ్యంలో మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా?
మణిపూర్.. నిత్యం ఘర్షణలు, హింసాత్మక సంఘటనలతో రగిలిపోతుంది. నానాటికి శాంతిభద్రతలు మరింతగా దిగజారిపోతున్నాయి. ఘర్షణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం బీరెన్ సింగ్ ఇవాళ తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సచివాలయం, రాజ్భవన్ వెలుపల ఆందోళన తీవ్రమైంది. గవర్నర్తో సీఎం అపాయింట్మెంట్ కోరారు. కాగా, సీఎం రాజీనామా చేయకూడదంటూ సచివాలయం దగ్గర కూడా నిరసనకు దిగారు.
Translate this News: