ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఈ సారి రాజ్యసభ సభ్యురాలు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వర్గాల మధ్య వివాదం జరిగింది. ఈ రోజు నిర్వహించిన మీటింగ్ లో రేణుకా చౌదరి మాట్లాడుతూ.. పదవులు కావాలి.. కానీ మీటింగ్లకు రారు అంటూ భట్టిని లక్ష్యంగా చేసుకుని కామెంట్స్ చేశారు. దీంతో భట్టి వర్గీయులు భగ్గుమన్నారు. రేణుకా చౌదరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల సమక్షంలోనే ఈ వివాదం జరిగింది. దీంతో అలర్ట్ అయిన మంత్రులు కార్యకర్తలకు సర్దిచెప్పారు. రేణుకాచౌదరి, భట్టి విక్రమార్క చాలా రోజులుగా విభేదాలు ఉన్నాయి. భట్టిని టార్గెట్ చేసుకుని అనేక సార్లు రేణుకాచౌదరి నేరుగానే విమర్శలు చేశారు. ఎంపీ ఎన్నికల వేళ బహిరంగంగా ఇలా విభేదాలు బయటపడడం ఖమ్మం పాలిటిక్స్ లో చర్చనీయాంశమైంది.
Khammam Politics: భట్టి Vs రేణుక.. ఖమ్మం కాంగ్రెస్ మీటింగ్ లో రచ్చ రచ్చ!
ఈ రోజు ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ మీటింగ్ లో రేణుకాచౌదరి, భట్టి విక్రమార్క వర్గాలు బహిరంగంగానే పంచాయితీకి దిగారు. 'పదవులు కావాలి.. కానీ మీటింగ్లకు రారు'.. అంటూ భట్టి టార్గెట్ గా రేణుక విమర్శలు చేయడం వివాదానికి కారణమైంది.
Translate this News: