KCR demanded PM Modi to give Bharat Ratna to Annabhau Sathe: ‘మహా’రాజకీయాలపై సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. గత కొంత కాలంగా మహారాష్ట్రలో ఆయన వరుస పర్యటనలు చేస్తున్నారు. తాజాగా ఈ రోజు కూడా ఆయన మహారాష్ట్రలో పర్యటించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా మొదట ఆయన కొల్లాపూర్ అంబ బాయి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సాంగ్లి జిల్లాలోని వాటేగావ్ గ్రామంలో పర్యటించారు. అక్కడ ప్రముఖ సంఘ సంస్కర్త దివంగత అన్నాభావ్ సాఠే 103వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అన్నాభావ్ సాఠే విగ్రహానికి కేసీఆర్ నివాళులర్పించారు.
పూర్తిగా చదవండి..మహారాష్ట్రపై సీఎం కేసీఆర్ ఫోకస్.. అన్నాభావ్ ను రష్యా గుర్తించినా… భారత్ పట్టించుకోలేదు…!
అన్నాభావ్ సాఠేకు భారతరత్న ప్రకటించాలని బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. సాఠే 103వ జయంతి సందర్భంగా మంగళవారం మహారాష్ట్రలోని వాటేగావ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. అంటరాని కులంలో పుట్టి జీవితాన్ని వడబోసిన దళిత బిడ్డ, దేశ మూలవాసి మాతంగి సమాజ ముద్దుబిడ్డ, అన్నాభావ్ సాఠేకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ డిమాండ్ చేశారు.
Translate this News: