ఐపీఎల్ 2024 42వ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ పంజాబ్ కింగ్స్తో తలపడింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఈ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 261 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్ 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో టీ20 హిస్టరీలో పంజాబ్ చరిత్ర సృష్టించింది. పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే కాకుండా టీ20 చరిత్రలోనే అతిపెద్ద స్కోరును చేజ్ చేసింది. 262 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 18.4 ఓవర్లలో ఛేదించింది. అంటే చివరికి ఎనిమిది బంతులు మిగిలాయి. ఐపీఎల్ చరిత్రలో 262 పరుగుల విజయవంతమైన ఛేజింగ్. అంతకుముందు ఐపీఎల్ 2020లో పంజాబ్పై రాజస్థాన్ 224 పరుగులను ఛేదించింది. జానీ బెయిర్స్టో, శశాంక్ సింగ్, ప్రభ్సిమ్రాన్ సింగ్లు పంజాబ్కు విజయాన్ని అందించారు.
IPL 2024 : రికార్డుల మోత మోగిన ఈడెన్ గార్డెన్స్..కోల్ కత్తా పై ఘనవిజయం సాధించిన పంజాబ్!
ఐపీఎల్-2024లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ అవుతోంది. ఈడెన్ గార్డెన్ లో కోల్కతా నైట్ రైడర్స్పై.. పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు రికార్డు లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించారు. ఐపీఎల్ టీ20 క్రికెట్ చరిత్రలో భారీ లక్ష్యాన్ని సాధించిన ఏకైక జట్టుగా పంజాబ్ నిలిచింది.
Translate this News: