మణిపూర్లో శాంతి నెలకొనేలా చూడాలని రాష్ట్ర గవర్నర్ అనసూయ ఉయికేని విపక్ష కూటమి ‘ఇండియా’ కు చెందిన ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. ఈ రాష్ట్రంలోని ప్రజలను . . ముఖ్యంగా షెల్టర్ హోమ్స్ లో తలదాచుకుంటున్న నిర్వాసితులను తాము కలుసుకున్నామని, వారి పరిస్థితులపై గవర్నర్ కు ఓ మెమోరాండం సమర్పించామని ఆ తరువాత కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తెలిపారు. కుకీ, మెయితీలు ఉంటున్న ప్రాంతాల్లోని రిలీఫ్ క్యాంపు లను నిన్న తాము విజిట్ చేశామని ఆయన చెప్పారు. ప్రభుత్వం వీరికి కేవలం ‘దాల్ చావల్’ మాత్రమే ఇస్తోందన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పునరుద్ధరణ విషయంలో వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను అభ్యర్థించినట్టు వెల్లడించారు. ఈ రాష్ట్రంలోని పరిస్థితులను తెలుసుకునేందుకు తమ ప్రతినిధి బృందమొక్కటే చొరవ చూపిందని, అఖిల పక్ష బృందాన్ని తీసుకువెళ్లాలని ప్రధాని మోడీ యోచించి ఉంటే మేము కూడా ఆ బృందంలో ఓ భాగమై ఉండేవారమని ఆయన చెప్పారు. ఇక్కడి పరిస్థితులను తాము పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్తామన్నారు.
పూర్తిగా చదవండి..శాంతి నెలకొనేలా చూడండి.. మణిపూర్ గవర్నర్కు విపక్ష కూటమి అభ్యర్థన
మణిపూర్లో పర్యటిస్తున్న ప్రతిపక్ష కూటమి ఇండియా ప్రతినిధుల బృందం రాష్ట్ర గవర్నర్ అనుసూయి ఉయికేని కలుసుకున్నారు. మెమోరాండం సమర్పించారు. మణిపూర్లో శాంతి, సామరస్యాన్ని పునరుద్ధరించాలని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని మెమోరాండంలో పేర్కొన్నారు.
Translate this News: