భారత్లో 2021లో ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల మీద వాట్సాప్, ఫేస్బుక్ యాజమాన్య సంస్థ మెటా పిటిషనల్ దాఖలు చేసింది. మెసేజ్లు ఎవరు పంపిస్తున్నారో ట్రేస్ చేసే విధానానికి సంబంధించి నిబంధనలు సవరించాలని డిమాండ్ చేశాయి. దీని మీద వాట్సాప్, ఫేస్ బుక్ సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీనిమీద ఢిల్లీ హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో మెటా తరుఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ను తొలగించాల్సి వస్తే భారత్లో వాట్సాప్ సేవలను నిలిపివేస్తామని అన్నారు. మా ప్లాట్ఫామ్లో మేసేజ్ల సెక్యూరిటీకి ఇంపార్టెన్స్ ఇస్తాము. దాని కోసమే ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం అవలంబిస్తున్నారు. ఆ గోప్యత హామీ ఉన్నందువల్లే కోట్లాది మంది యూజర్లు దీన్ని వినియోగిస్తున్నారు. ఇప్పుడు భారత్లో పెట్టిన రూల్తో మేం బలవంతంగా ఆ ఎన్క్రిప్షన్ను బ్రేక్ చేయాల్సి ఉంటుంది. అలా చేయాలని మీరు చెబితే మేం భారత్ నుంచి వెళ్లిపోతాం అని కోర్టు తెలిపారు.
పూర్తిగా చదవండి..Whats App: అలా అయితే ఇండియా నుంచి వెళ్ళిపోతాం..వాట్సాప్
యూజర్ల మెసేజ్లకు సెక్యూరిటీనిచ్చే ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ను బ్రేక్ చేయాల్సి వస్తే తాము బారత్ నుంచి వెళ్ళిపోతామని చెబుతోంది వాట్సాప్ యాజమాన్యం. ఐటీ రూల్స్ - 2021లోని 4(2) నిబంధనను సవాల్ చేస్తూ వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
Translate this News: