Chandrababu : ఎన్డీయే (NDA) సభాపక్షనేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు (Chandrababu). రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పుని ప్రజలు ఇచ్చారని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని పేర్కొన్నారు. నూటికి నూరు శాతం 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేశారు
ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పనిచేశారని అన్నారు. మూడు పార్టీల నేతలు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.
Chandrababu: పవన్ సమయస్ఫూర్తి ఎప్పటికీ మరిచిపోలేను : చంద్రబాబు
AP: పవన్ కళ్యాణ్ సమయస్ఫూర్తి ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు చంద్రబాబు. జైలులో ఉన్నప్పుడు పవన్ వచ్చి పరామర్శించారని గుర్తు చేశారు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటున్నట్లు తెలిపారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుందని తెలిపారు.
Translate this News: