తిరుమలలో గురువారం రాత్రి చిన్నారిపై చిరుత దాడిచేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో చిన్నారి క్షేమంగా బయటపడ్డాడు. చిన్నారి కౌశిక్ కు ఎలాంటి ప్రాణాపాయం లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. చిరుత ఏడాదిన్నర కూన కావడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. నోటితో కరిచి పట్టుకోవడం చిరుతకు రాకపోవడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడన్నారు. చిరుత చిన్నదా కావడంతో బాలుడిని సరిగ్గా పట్టుకోవడం రాలేదని…కాలుతో పట్టుకెళ్లందని..నోటితో పట్టుకోలేకపోవడం వల్లే బాలుడు బతికాడని తెలిపారు. నోటితో కరిస్తే బతికే అవకాశమే లేదన్నారు.
పూర్తిగా చదవండి..బాలుడిపై చిరుత దాడి.. తిరుమలలో టెన్షన్
తిరుమల నడకదారిలో గురువారం రాత్రి చిన్నారిపై చిరుత దాడి చేసి లాక్కెళ్లడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చిన్నారి కౌశిక్ క్షేమంగా ఉన్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కౌశిక్ కు ఎలాంటి ప్రాణాపాయం లేదన్నారు. చిరుత ఏడాదిన్నర కూన కావడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు.
Translate this News: