EC Serious : ఏపీలో ఎన్నికల(AP Elections) సందర్భంగా చెలరేగిన హింసపై ఈసీ(Election Commission) సీరియస్ అయ్యింది. సీఎస్ జవహర్ రెడ్డి(CS Jawahar Reddy), డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సమన్లు జారీ చేసింది. ఈ ఇద్దరు అధికారులను ఢిల్లీ(Delhi)కి రావాలని ఆదేశించింది. దీంతో రేపు సాయంత్రం ఏపీ డీజీపీ, సీఎస్ ఢిల్లీకి వెళ్లి ఈసీకి నివేదిక వివరించనున్నారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులను వివరించనున్నారు. ఏపీలో ఎన్నికల తరువాత జరుగుతున్న హింసను అరికట్టడంలో డీజీపీ, సీఎస్ లు విఫలమైనట్లు ఎన్నికల కమిషన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొనసాగుతున్న హింసపై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
AP Violence : ఏపీ డీజీపీ, సీఎస్ పై ఈసీ సీరియస్.. సమన్లు జారీ!
ఏపీ డీజీపీ, సీఎస్ పై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. రాష్ట్రంలో చెలరేగుతున్న హింసకు సంబంధించి వ్యక్తిగతంగా హాజరై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రాష్ట్రంలో హింసను అరికట్టడంలో డీజీపీ, సీఎస్ లు విఫలమైనట్లు ఎన్నికల కమిషన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
Translate this News: