Kurnool : అది 1960 జనవరి.. ప్రాంతం కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు గ్రామం.. ఢిల్లీ (Delhi) నుంచి వచ్చిన హస్తం పార్టీ పెద్దలతో కలిసి నాటి ఏపీ కాంగ్రెస్ (Congress) యువనాయకుడిగా ఉన్న చక్రపాణి ఓ ఇంటికి వెళ్లారు. గ్రామ పొలిమేరలలో ఉన్న పూరి పాక అది. ఆ పాక బయట ఒక ముసలవ్వ కట్టెల పొయ్యిపై మట్టి కుండతో అన్నం వండుతోంది. పొగ గొట్టంతో మంటను ఊదుతూ చెమటలు కక్కుతోంది. చక్రపాణి (Chakrapani) నడుస్తూ ఆ అవ్వ దగ్గరకు వెళ్తుంటే పక్కనే ఉన్న ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు నోరెళ్లబెట్టి చూస్తున్నారు. ఎందుకంటే ఆ ఇల్లు ఎవరిదో కాదు కాబోయే ముఖ్యమంత్రి సంజీవయ్య (Sanjeevaiah) దని వారికి అప్పటికే అర్థమైంది. దేశానికి తొలి దళిత సీఎంని ఇచ్చిన రాష్ట్రంగా ఏపీ పేరు సంపాదించుకున్న రోజులవి..!
పూర్తిగా చదవండి..Damodaram Sanjeevaiah : ఏపీ తొలి దళిత ముఖ్యమంత్రి.. దేశంలోనే అత్యంత నిరుపేద సీఎం!
ఏపీకి తొలి దళిత ముఖ్యమంత్రి, దేశంలోనే అత్యంత నిరుపేద సీఎంగా దామోదరం సంజీవయ్య చరిత్రలో నిలిచిపోయారు. ప్రజాప్రతినిధిగా వచ్చిన జీతం తప్ప మరో ఆదాయం లేదు. ఆయన మరణించే వరకు బట్టలు, ఒక ప్లేటు, గ్లాసు మాత్రమే.. ఆసక్తికరమైన స్టోరీ కోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.
Translate this News: