సైక్లోన్ బిపార్జోయ్ ముప్పు ముంచుకొస్తుంది. ఇవాళ గుజరాత్ తీరం దాటే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఈ మధ్యాహ్నం తర్వాత గుజరాత్లోని కచ్ తీరాన్ని తాకనుంది. ల్యాండ్ ఫాల్ అయ్యే సమయంలో గంటకు 125 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అదే సమయంలో గుజరాత్ సర్కార్ 74 వేల మందికి పైగా ప్రజలను తాత్కాలిక శిబిరాలకు తరలించింది. గుజరాత్లోని 8 జిల్లాల్లో ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నేవీ, కోస్ట్గార్డ్, ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్లను మోహరించారు. అదే సమయంలో, NDRF 42 బృందాలను వివిధ రాష్ట్రాల్లో మోహరించారు. ఈ తుఫానుకు సంబంధించి PMO కూడా చాలా చురుకుగా ఉంది. ప్రతి క్షణం అప్డేట్ను స్వయంగా ప్రధాని మోదీ తెలుసుకుంటున్నారు. ఢిల్లీ నుంచి గాంధీనగర్ వరకు అన్ని ఏజెన్సీలు అప్రమత్తంగా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..ముంచుకొస్తున్న బిపార్జోయ్ ముప్పు, ఇవాళ గుజరాత్ తీరం దాటే అవకాశం..!!
Translate this News: