టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కడప జిల్లా పులివెందుల గడ్డపై పొలికేక వేశారు. టీడీపీ నేతలను రెచ్చగొడితే కొదమసింహంలా అణచివేస్తామని వైసీపీ నేతలను హెచ్చరించారు. పులివెందులలో చంద్రబాబు బహిరంగసభకు జనం భారీగా తరలివచ్చారు. ఈ సభకు జనం ఎంతమంది వచ్చారో సీఎం జగన్ చూడాలి అని హితవుపలికారు. పులివెందుల ప్రజల్లో తిరుగుబాటు కనిపిస్తోందని అన్నారు. కేంద్రం ఆంధ్రులకు ఇచ్చిన పోలవరాన్ని జగన్ గోదావరిలో కలిపేశారని విమర్శించారు. ప్రాజెక్టుల పేరిట రూ.5 వేల కోట్లు దోచుకోవాలన్నది జగన్ ప్రణాళిక అని ఆరోపించారు. రాయలసీమ ఆశాజ్యోతి ఎన్టీఆర్ అని కొనియాడారు. రాయలసీమకు నీళ్లు ఇచ్చాకే, చెన్నైకి నీళ్లు ఇవ్వాలని ఎన్టీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఎస్ఆర్బీసీ ప్రారంభించిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు.
పూర్తిగా చదవండి..వైనాట్ పులివెందుల.. జగన్కు చంద్రబాబు ఛాలెంజ్
'వైనాట్ పులివెందుల' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్కు ఛాలెంజ్ చేశారు. టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవిని గెలిపించాలని పులివెందుల ప్రజలను కోరారు. పులివెందులలో చంద్రబాబు పర్యటనకు జనాల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ పర్యటనలో బాబు ప్రసంగం టీడీపీ శ్రేణులకు కొత్త ఉత్సాహం ఇచ్చింది.
Translate this News: