నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ కు వలసలు సాగుతున్న సమయంలో పార్టీ మారే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని, నడి రోడ్డుపై ఉరితీయాలని, శవ యాత్రలు చేయాలని నేటి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నాడు సుద్దపూస మాదిరిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి నేడు అవే ఫిరాయింపులను ప్రోత్సహించడం నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అన్న మాదిరిగా ఉంది. ఈ అనైతిక వలసలు రాహుల్ గాంధీకి తెలిసే జరుగుతున్నాయా? అన్న సందేహం వ్యక్తం అవుతోంది. అయితే.. వలసలతో పార్టీలు కనుమరుగు అవుతాయని, కోలుకోకుండా దెబ్బతింటాయని భావించడం మూర్ఖత్వం, రాజకీయ అజ్ఞానమే అవుతుంది. గతంలో కేవలం 3 సీట్లకే పరిమితమైన బీజేపీ నేడు 300 సీట్లకు చేరిన విషయం తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల ముందు కేవలం ఐదుగురే ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 64 సీట్లు వచ్చాయి. దీన్ని బట్టి ఎమ్మెల్యేల సంఖ్యకు, ప్రజల ఆలోచనకు సంబంధం లేదని స్పష్టం అవుతుంది.
పూర్తిగా చదవండి..Dasoju Sravan: రేవంత్ చెప్పిందేంటి? చేస్తున్నదేంటి?
ఎన్నికల సమయంలో ఇచ్చిన వందలాది హామీల అమలుపై దృష్టిసారించకుండా కేవలం రాజకీయాలపైనే రేవంత్ సర్కార్ దృష్టి సారిస్తోంది. ప్రతిపక్షంపై కక్షసాధింపు చర్యలపై ఉన్న శ్రద్ధ అన్నదాతలను ఆదుకోవడంపై లేదు. -డా. దాసోజు శ్రవణ్
Translate this News: