విభజన హామీల అమలు కాంగ్రెస్ తోనే సాధ్యమని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా తెస్తానని గతంలో చెప్పిన జగన్ నేడు మోడీ కంబంధ హస్తాల్లో చిక్కుకుపోయారని ఫైర్ అయ్యారు. ఏపీ అభివృద్ధి కోసం రాహుల్ గాంధీ తపనపడుతున్నారన్నారు. తమ తల్లి విజయమ్మ తన వైపే లేదా.. జగన్ వైపో ఉండకుండా న్యూట్రల్ గా ఉండాలని భావిస్తున్నారని చెప్పారు. ఏపీ ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నానన్నారు. తన తండ్రి లెగసీని తాను కొనసాగిస్తానన్న నమ్మకం ఉందన్నారు. షర్మిల పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.
YS Sharmila Interview: అమ్మ అమెరికా ఎందుకెళ్లిందంటే.. షర్మిల సంచలన ఇంటర్వ్యూ!
వైఎస్ విజయమ్మ కొడుకు, కూతురు విషయంలో న్యూట్రల్ గా ఉండాలని భావిస్తున్నారని చెప్పారు వైఎస్ షర్మిల. ఈ విషయాన్ని ఏపీ ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నానన్నారు. విభజన హామీలు అమలై, ఏపీ అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు.
Translate this News: