నైరుతి రుతుపవనాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న మూడు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రంలో తెలిపింది. నైరుతి బంగాళఖాతం, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించి ఉన్న నేపథ్యంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఏపీలోని యానాం, ఉత్తరకోస్తలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
పూర్తిగా చదవండి..తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్..రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు..!!
భారీ వర్షాలతో ఉత్తరభారత తడిసిముద్దైతుంది. వరద తాకిడికి నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కుండపోత వర్షాలకు ఇప్పటివరకు 28 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా నైరుతి రుతుపవనాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై భారీగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. వచ్చే రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
Translate this News: