Trolling Trouble: టెక్నాలజీ పెరగడం అంటే అభివృద్ధికి ఆసరాగా నిలబడటం. దాని ఆధారంగా మన జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవడం. అయితే, ప్రస్తుతం మాత్రం టెక్నాలజీ ఉపయోగించుకుని ఎదుటి వ్యక్తిని ఆడుకోవడం.. తోటి మనుషులను దారుణంగా మానసికంగా హింసించడంగా మారిపోయింది. టెక్నాలజీ మార్పు హింసించడానికి ఉపయోగించుకోవడం అనేది చాలా సాధారణంగా అయిపొయింది. సమాచార విప్లవం అంటే.. మనిషిని మనిషిని దగ్గర చేసేదిలా ఉండాలి. మనుషుల మధ్య దూరాల్ని దారంలా కలిపేలా ఉండాలి. కానీ, ఇప్పుడు కొంతమంది దానిని మాటల విరుపులతో.. పదాల హింసాత్మక ప్రయోగాలతో.. నోటితో మాట్లాడటానికి కూడా అసహ్యించుకునే పదాల్ని విచ్చలవిడిగా అవతల వారిపై ప్రయోగించడం కోసం వాడుతున్నారు. సున్నిత మనస్కుల మరణాన్ని హ్యాష్ టాగ్స్ తో తీసుకువస్తున్నారు. ట్వీట్ ల బురద.. ఇన్స్టా వరదతో పరువు మునిగిపోతుంటే, బాధితులు చావు పరిష్కారాన్ని వెతుక్కుంటూ కుటుంబాన్ని దిక్కులేనిదిగా చేసేస్తున్నారు. తాజాగా తెనాలి గీతాంజలి అనే యువతి ట్రోలింగ్ భూతం (Trolling Cancer)పెట్టిన హింసతో రైలు కింద పది నిండు జీవితాన్ని బలిచేసుకుంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మనకు తెలీని ఇలాంటి సంఘటనలు ఎన్నో నిత్యం జరుగుతూనే ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Trolling Trouble: ట్రోలింగ్ కిల్లింగ్..సైకోలుగా మారుతున్న సోషల్ మీడియా ఎడిక్ట్స్!
సోషల్ మీడియాలో ట్రోలింగ్ భూతం అమాయకులను మింగేస్తోంది. సామాన్యులకు చావు డప్పు మోగిస్తున్నారు సోషల్ మీడియా సోమరిపోతులు. విచక్షణారహితంగా.. అసభ్యకరంగా.. ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్న ట్రోలింగ్ సైకోలను కట్టడి చేయకపోతే భవిష్యత్ తరాల్ని మానసిక వికలాంగులుగా చేసేస్తుంది.
Translate this News: