ఆగస్టు 1 నుంచి తెలుగు దేశం పార్టీ (tdp) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Achchennaidu) తెలిపారు. శనివారం ఆయన మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) అవినీతి, అధికార మత్తులో ఉండి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు, సాగు నీరు, వ్యవసాయరంగాలను పూర్తిగా భ్రష్టు పట్టించారని విమర్శించారు. దేశానికి అన్నంపెట్టే రైతులు ప్రస్తుత పరిస్థితులను చూసి వ్యవసాయాన్ని వదిలేసి పంటలు పండిచకపోవడమే మంచిదనే ఉద్దేశంతో కూలీ పనులకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పంటలు పండించకుండా చేసింది జగన్ మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. జగన్ వైఫల్యాలను ఎత్తి చూపడానికే వచ్చే నెల 1 నుంచి 10వ తేదీ వరకు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లబోతున్నారని చెప్పారు
పూర్తిగా చదవండి..ఆగస్టు 1 నుంచి టీడీపీ ప్రాజెక్టుల యాత్ర
ఏపీలో ప్రాజెక్టుల సందర్శన యాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబు బయలుదేరనున్నారు. ఆగస్టు 1 నుంచి 10 వరకు రాష్ట్రంలోని ప్రాజెక్టులను పరిశీలించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీ అధక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 69 నదులు ఉన్నా.. సీఎం జగన్ మాత్రం వాటిని ప్రజలకు ఉయయోగపడే విధంగా చేయడంలేదని మండిపడ్డారు.
Translate this News: