Reason Behind MS Dhoni Batting at No.9: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ లోయర్ ఆర్డ్లో బ్యాటింగ్కి వస్తున్న విషయం తెలిసిందే. ఇక గత మ్యాచులోనైతే ఏకంగా నెం.9 స్థానంలో కూడా బ్యాటింగ్ చేశాడు. దీంతో అభిమానులు నిరాశకు గురౌతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్లో మహేంద్రుడు వీలైనంత వెనక్కి జరుగుతున్నాడంటూ విమర్శలు చేస్తున్నారు. మాజీలు కూడా ఇదే అభిప్రాయపడుతున్నారు. ఎంఎస్డీ బ్యాటింగ్లో ముందుకు రాలేకపోతే అతడిని తొలిగించి ఓ అదనపు బౌలర్ను ఆడించాల్సిందని భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.
అయితే తాజాగా ఎంఎస్ ధోనీ చివర్లో బ్యాటింగ్ ఎందుకు వస్తున్నాడో తెలిసింది. తప్పనిసరి పరిస్థితిలోనే ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఐపీఎల్లో మొదటి నుంచి అతడు తొడ కండరాల గాయంతోనే ఆడుతున్నాడట. అందుకే అతడు ఎక్కువ సేపు పరిగెత్తలేకే చివర్లో వస్తున్నాడని చెన్నై ఫ్రాంచైజీ వర్గాలు వెల్లడించాయి.
పూర్తిగా చదవండి.. [vuukle]