Punganur Politics : చిత్తూరు జిల్లా పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డికి, రామచంద్ర యాదవ్కు మధ్య రోజు రోజుకూ వార్ ముదురుతోంది. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కాన్వాయ్పై నిన్న రాళ్ల దాడి చేసిన సంగతి తెలిసిందే. మంత్రి పెద్దిరెడ్డి సొంత గ్రామం ఎర్రతివారిపల్లికి వెళ్లిన రామచంద్ర యాదవ్ కాన్వాయ్లోని 10 వాహనాలపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు.
పూర్తిగా చదవండి..Also Read: ఏపీ ఎన్నికల్లో గాజు గ్లాసు రచ్చ.. ఫ్రి సింబల్గా చేర్చడంపై జనసేన అభ్యంతరం..!
ఈ ఘటనపై తాజాగా బీసీవై అధినేత రామచంద్రయాదవ్ స్పందించారు.పెద్దిరెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తనను చంపాలనే ప్లాన్ తోనే పెద్దిరెడ్డి దాడులు చేయించారని ఆరోపించారు. ఓటమి భయంతోనే తమపై దాడులు చేస్తున్నారన్నారు. భయానక వాతావరణం సృష్టించారని రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: వైసీపీ స్టార్ క్యాంపైనర్ల జాబితాలో పోసాని కృష్ణ మురళి.. 37 మందిలో ఎవరెవరు ఉన్నారంటే..?
పోలీసుల ముందే తమ వాహనాలను ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమని రామచంద్రయాదవ్ పేర్కొన్నారు. అయితే, కావాలనే గూండాలను దించి గొడవలు సృష్టిస్తున్నారని మిథున్రెడ్డి ఆరోపణలు చేశారు. సింపతీతో ఓట్లు రాబట్టేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు
[vuukle]