Old Indian Parliament History: భారత ప్రజాస్వామ్యానికి దేవాలయం పాత పార్లమెంటు భవనం(Old Parliament building).. బ్రిటీష్ పాలకుల గుండెల్లో పిడుగై పడ్డ భగత్సింగ్(Bhagat singh) బాంబులకు అడ్డా ఈ భవనం.. దేశ రాజధాని కోల్కతా నుంచి ఢిల్లీకి మారడానికి కారణమైన భవనం కూడా ఇదే..! స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నాటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేసిన చారిత్రాత్మక ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ(tryst with destiny)’ ప్రసంగంతో దేశం పునర్జన్మ పొందింది. బానిస సంకేళ్లను తెంచుకుంటూ స్వేచ్ఛ ప్రపంచంలోకి ఇండియా అడుగుపెట్టిన తొలి రోజు నుంచి దేశాన్ని ముందుండి నడిపిస్తోన్న పాత పార్లమెంట్ భవనానికి భారత్ అధికారికంగా వీడ్కోలు పలికింది. కొత్త పార్లమెంట్ భవనం నుంచే ఇకపై దేశం ముందడుగులు వేయనుంది. ఎన్నో జ్ఞాపకాలు.. మరెన్నో తీపి అనుభూతులు.. చేదు ఘటనలు.. బాంబు దాడులు.. నిరసనలు.. గొడవలు.. కొట్లాటలు..ఇలా పాత పార్లమెంట్లో జరిగిన ప్రతీ విషయాన్ని ప్రజాప్రతినిధులు, ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కొత్త ఇంటికి వెళ్తున్నామన్న ఆనందం ఒకవైపు ఉంటే పుట్టి పెరిగిన ఇంటిని వదిలేస్తున్నామన్న బాధ మరోవైపు ఉన్నట్టు అనిపించకమానదు.
పూర్తిగా చదవండి..Old Indian Parliament: భగత్సింగ్, నెహ్రు నుంచి మోదీ వరకు.. పాత పార్లమెంట్ భవనం చరిత్ర ఇదే..!
ఉగ్రవాదుల బాంబు దాడులను కూడా భరించి నిలబడిన పాత పార్లమెంట్ భవనం ఇక ఒక జ్ఞాపకంగా మిగిలిపోనుంది. భగత్సింగ్ విప్లవ పోరాటానికి ఊపిరిలూదిన ఈ భవనం ఇక ఒక చరిత్రగా మిగిలిపోనుంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెహ్రూ ఇచ్చిన తొలి సందేశం దగ్గర నుంచి ఎన్నో అపూరుప ఘట్టాలు.. కీలక మైలురాళ్లకు కేరాఫ్గా ఉన్న పాత పార్లమెంట్ బిల్డింగ్కు ఇక అల్విదా పలుకుతోంది దేశం.
Translate this News: