Encounter : ఛత్తీస్గడ్(Chhattisgarh)లో మరోసారి కాల్పుల మోత మోగింది. మావోయిస్టులు(Maoists), పోలీసులకు(Police) మధ్య భీకర కాల్పులు చోటుచేసుకుంది. బీజాపూర్లోని పిడియా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే ఈ కాల్పులపై అధికారంగా పోలీసులు ధ్రువీకరించలేదు. 1000 మంది పోలీస్ బలగాలతో కూంబింగ్ నిర్వహించారు. ఉదయం నుంచి సెర్చింగ్ కొనసాగుతోంది. పోలీస్ బలగాలు అడవిని జల్లెడ పడుతున్నారు. ఎన్కౌంటర్ను ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్నారు. బీజాపూర్, సుక్మా, దంతెవాడ ఎస్పీలు ఇటీవల ఎన్కౌంటర్లో సుమారు 40 మంది మావోల మృతి చెందినట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..Breaking : ఎన్నికల వేళ బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
బీజాపూర్లో మళ్ళీ భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్ అనంతరం అధికారులు ఆయుధాలను భారీగా సీజ్ చేశారు. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.
Translate this News: