మన ఇంట్లో నలుగురు ఉంటే.. నలుగురికీ ఓట్లు ఉంటే అందులో ఇద్దరు ఓటు(Vote) వేయడమా? అని బద్ధకిస్తారు.. ఒకరు పొద్దున్నే వెళ్లి ఓటు వేసి డ్యూటీకి వెళ్ళిపోతారు. నాలుగో వ్యక్తి సాయంత్రం దాకా చూసి అప్పుడు వెళ్లి ఎదో వేశామన్నట్టు ఓటు(Vote) వేసి వస్తాడు. మొన్న తెలంగాణ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ఓటింగ్ శాతం గుర్తుంది కదా. అంతా చదువుకున్న వారు ఉండి కూడా.. అవగాహన కలిగి కూడా 60 శాతం ఓటర్లు ఓటు వేయకుండా కూచున్నారు. కానీ, ఇప్పుడు కర్ణాటక లో ఒక కుటుంబాన్ని చూస్తే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తప్పనిసరిగా ఇంటిల్లిపాదీ వెళ్లి ఓటు వేసి వస్తారు. నిజం ఆ కుటుంబం చేసిన పని అలాంటిది.
పూర్తిగా చదవండి..Vote: కలిసికట్టుగా.. ఒకే జట్టుగా 96 మంది కుటుంబసభ్యులు ఓటేశారు
కర్ణాటకలోని నోల్వి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 96 మంది ఒకేసారి కలిసి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సంఘటన అందరి ప్రశంసలు పండుతోంది. ఆ వివరాలు ఆర్టికల్ లో చూడొచ్చు.
Translate this News: