Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి(Nymisha Reddy) తన గొప్ప మనసును చాటుకుంది. హైదరాబాద్(Hyderabad) ఎల్బీనగర్లోని బీఎన్ రెడ్డి, సేఫ్ ఛారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ అనాథ ఆశ్రమానికి(Orphanage) చెందిన 30 మంది అనాథ పిల్లలకు నిన్న ఉప్పల్లో జరిగిన ఐపీఎల్(IPL) మ్యాచ్ చూసే అవకాశం కల్పించారు. ఈ 30 మంది పిల్లలకు టికెట్లు కొని వాళ్లని స్వయంగా నైమిషా రెడ్డి స్టేడియంకి తీసుకెళ్లారు. ఆ పిల్లలతో పాటు ఆమె మ్యాచ్ను వీక్షించారు. అయితే మొదటిసారిగా స్టేడియంలో మ్యాచ్ను నేరుగా చూడటం, ఆటగాళ్లను దగ్గరి నుంచి చూడటంతో ఆ అనాథ పిల్లలు ఆనందంలో మునిగిపోయారు. ఆ చిన్నారుల్లో సంతోషం నింపేందుకే నైమిషా ఈ పని చేశారని ఆమె సన్నిహితులు చెప్పారు.
పూర్తిగా చదవండి..Nymisha Reddy : గొప్ప మనసు చాటుకున్న సీఎం రేవంత్ కూతురు
సీఎం రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి తన గొప్ప మనసును చాటుకున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్లోని బీఎన్ రెడ్డి, సేఫ్ ఛారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ అనాథ ఆశ్రమానికి చెందిన 30 మంది అనాథ పిల్లలకు నిన్న ఉప్పల్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చూసే అవకాశం కల్పించారు.
Translate this News: