పుట్టి పెరిగింది ఇక్కడే..ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లారు. అక్కడే నివాసముంటున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే కుటుంబం వాళ్లది. ఆటపాటలతో నిత్యం ఆనందంగా గడిపే ఫ్యామిలీ వాళ్లది. సెలవు దొరికితే సరదాగా షీకారుకు వెళ్లే వాళ్ల జీవితాలపై మృత్యువు దాడి చేసింది. ఒకరి ప్రాణాలను బలిగొంది. అమెరికాలో అద్దంకికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొట్టి రాజేశ్కుమార్ (42) ప్రమాదవశాత్తూ చనిపోవడం స్థానికంగా విషాదఛాయలు నింపింది.
పూర్తిగా చదవండి..పిల్లలను కాపాడి.. ప్రాణాలు వదిలి.. అమెరికాలో అద్దంకి వాసి మృతి!
బాపట్ల జిల్లాకు చెందిన పొట్టి రాజేశ్ కుమార్ అమెరికాలో మృతి చెందారు. ఉద్యోగరీత్యా ఫ్లోరిడా బ్రిడ్స్ వాటర్ కమ్యూనిటీలో నివాసముంటున రాజేశ్కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబంతో కలిసి జాక్సన్ విల్ విట్లర్ బీచ్కు విహార యాత్రకు వెళ్లగా..అక్కడ సముద్రంలో స్నానంగా చేస్తుండగా అలల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. దీంతో సముద్రంలో పిల్లలు కొట్టకుపోయారు. వాళ్లని కాపాడే క్రమంలో రాజేశ్ ప్రాణాలు విడిచారు. రాజేశ్ మృతి పట్ల అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సంతాపం తెలిపారు.

Translate this News: