Bengaluru Rave Party: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతోన్న బెంగళూరు రేవ్ పార్టీ మూలాలు బెజవాడలో బయటపడ్డాయి. ఈ రేవ్ పార్టీలో అరెస్టైన ప్రధాన నిందితుడు లంకపల్లి వాసుది (Lankapalli Vasu) విజయవాడే. ఆంజనేయవాగు సమీపంలోని బ్రహ్మంగారి మఠం వీధికి చెందిన వాసుది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. వాసు కుటుంబం పూరింట్లో ఉండేంది. తండ్రి మరణించడంతో తల్లి దోసెలమ్మి కుటుంబాన్ని పోషించేది. వాసుకి ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య ఉన్నారు. అయితే క్రికెటర్ కావాలన్న లక్ష్యమే వాసుని బుకీగా మార్చింది. క్రికెట్, హాకీ, కబడ్డీ ఇలా అన్ని క్రీడల్లో బుకీగా వ్యవహరించేవాడు. తెలుగు రాష్ట్రాలు సహా బెంగళూరు, చెన్నై ముంబైల్లో భారీగా బెట్టింగ్ (Betting) నెట్వర్క్ ఏర్పాటుచేసుకున్నాడు. ఆ తర్వాత తన వ్యాపారాన్ని మరింత విస్తరించి హైదరాబాద్, బెంగళూరుల్లో పబ్లు కూడా నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు విజయవాడలోనే ఉంటారు. వాసు అప్పుడప్పుడు ఇంటికొచ్చి వెళ్తుంటాడు. దుబాయ్, బెంగళూరు, మలేషియాలో పనిచేస్తానని చుట్టుపక్కలవారిని నమ్మించాడు.
పూర్తిగా చదవండి..Rave Party: రేవ్ పార్టీ సూత్రధారి తెలుగువాడే.. దోసెలమ్మి రూ.కోట్లకు ఎదిగి..!
బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన మూలాలు బెజవాడలో బయటపడ్డాయి. ప్రధాన నిందితుడు లంకపల్లి వాసుది విజయవాడ అని పోలీసులు గుర్తించారు. పూరింట్లో ఉంటూ తల్లితో దోసెలమ్మిన వాసు.. బుకీగా మారి కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు.
Translate this News: