ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో తన తమ్ముడు ఆమంచి కృష్ణమోహన్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడానికి తెరవెనుక రాజకీయాలు చేసిన వ్యక్తిగా ఆమంచి స్వాములుకు పేరుంది. దీంతో తమ్ముడు ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు వైసీపీ ఇన్చార్జిగా ఉండగా అన్న ఆమంచి స్వాములు జనసేనలో చేరడం ఇటు చీరాల, అటు గిద్దలూరులో రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ఈనెల 15వ తేదిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరేందుకు స్వాములు గ్రౌండ్ సన్నద్ధం అయ్యారు. చీరాల నియోజకవర్గానికి చెందిన కాపు సంఘాల నాయకుడిగా ఉన్న ఆమంచి స్వాములు పెద్దసంఖ్యలో తన అభిమానులతో కలిసి వెళ్ళి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకునేందుకు సన్నద్దం అయ్యారని తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..తమ్ముడు వైసీపీ, అన్న జనసేన.. రసవత్తరంగా మారిన పాలిటిక్స్
ఎలక్షన్లు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ నేతలు ఎటు వైపు మళ్లుతున్నారో తెలియక కార్యకర్తలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు వైసీపీ నేత, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు రంగం సిద్దం చేసుకుంటున్నారన్న వార్త ప్రస్తుతం రాజకీయంగా హాట్ టాఫిక్గా మారింది.
Translate this News: