• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar
  • Skip to footer
Rtvlive.com

Rtvlive.com

News Updates from Andhra Pradesh and Telangana

  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • ట్రెండింగ్
  • వైరల్
  • బిజినెస్
  • స్పోర్ట్స్
  • జాబ్స్
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • ఖమ్మం
    • వరంగల్
    • మెదక్
    • మహబూబ్ నగర్
    • నిజామాబాద్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
  • ఆంధ్రప్రదేశ్
    • విజయవాడ
    • తిరుపతి
    • వైజాగ్
    • ఒంగోలు
    • శ్రీకాకుళం
    • కర్నూలు
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • అనంతపురం
    • విజయనగరం
    • నెల్లూరు
    • గుంటూరు
    • కడప
  • హైదరాబాద్
  • వరంగల్
  • నిజామాబాద్
  • విజయవాడ
  • వైజాగ్
Home » వివేకా హత్యకేసులో నాస్టేట్ మెంట్ మార్చేశారు..మాజీ ఐఏఎస్ అజయ్ కల్లాం.!

వివేకా హత్యకేసులో నాస్టేట్ మెంట్ మార్చేశారు..మాజీ ఐఏఎస్ అజయ్ కల్లాం.!

Published on July 29, 2023 1:39 pm by V. Sai Krishna

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ వ్యవహరించిన తీరుపై మాజీ ఐఏఎస్ అజయ్ కల్లాం హైకోర్టును ఆశ్రయించారు. తన వాగ్మూలానికి ఏ మాత్రం పొంతన లేని సమాచారాన్ని సీబీఐ ఛార్జ్ షీట్ తయారు చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవాలపై లోతైన విచారణ జరగాలనే ఉద్దేశంతో హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేశానని పేర్కొన్నారు.వివేకా హత్య కేసు వ్యవహారంలో సీబీఐ ఎస్పీ తనను కలిసి వివరాలు తీసుకున్నారని అజయ్ కల్లాం గతంలో చెప్పారు. చిట్ చాట్ అని చెప్పి సీబీఐ తన నుంచి కొన్ని వివరాలు తీసుకుందని.. తాను చెప్పిన వివరాలతో సీబీఐ రూపొందించిన 161 స్టేట్ మెంట్‌‌కు ఎలాంటి విలువ లేదన్నారు.కాని సీబీఐ ఛార్జిషీటులో వీటిని మార్చివేసిందన్నారు. జగన్‌ సతీమణి ప్రస్తావన కాని, మరే ఇతర ప్రస్తావన కాని తాను చేయలేదని..తాను చెప్పినట్టుగా ఛార్జిషీటులో సీబీఐ పేర్కొన్న స్టేట్‌మెంట్‌లో అబద్ధాలే ఉన్నాయన్నారు.

Translate this News:

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ వ్యవహరించిన తీరుపై మాజీ ఐఏఎస్ అజయ్ కల్లాం హైకోర్టును ఆశ్రయించారు. తన వాగ్మూలానికి ఏ మాత్రం పొంతన లేని సమాచారాన్ని సీబీఐ ఛార్జ్ షీట్ తయారు చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవాలపై లోతైన విచారణ జరగాలనే ఉద్దేశంతో హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేశానని పేర్కొన్నారు.

నిజాయితీతో తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని సైతం సీబీఐ మార్చేసిందని వాపోయారు. ఈ లెక్కన విచార‌ణ ఏ స్థాయిలో ప‌క్క‌దారి ప‌డుతోందో అర్థం చేసుకోవ‌చ్చని అజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.

సీబీఐ తీరు ఎవరి అండతో మారింది..? దీని వెనుక ఎవరి ప్రయత్నాలున్నాయి ?.. సీబీఐ లాంటి సంస్థ వివేకా హ‌త్య కేసును ఎందుకు ఏక‌ప‌క్షంగా వ్యవహరిస్తోంది..? అని ప్రశ్నించారు.

అజయ్ కల్లాం మార్చి 15, 2019న జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ..వైఎస్ జగన్‌ నివాసంలో సుమారు ఉదయం 5 గంటల సమయంలో మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమైందన్నారు.

సమావేశం మొదలైన గంటన్నర తర్వాత అటెండర్‌ వచ్చి డోరు కొట్టారని..ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి బయటకు వెళ్లి, తిరిగి వచ్చి జగన్‌గారికి ఏదో విషయం చెప్పారన్నారు. వెంటనే జగన్‌ షాక్‌కు గురైనట్టుగా లేచి చిన్నాన్న చనిపోయారని చెప్పారన్నారు.

ఇంతకుమించి తానేమీ సీబీఐకి చెప్పలేదన్నారు. స్టేట్‌మెంట్లో తాను ఇదే చెప్పానని..కాని సీబీఐ ఛార్జిషీటులో వీటిని మార్చివేసిందన్నారు. జగన్‌ సతీమణి ప్రస్తావన కాని, మరే ఇతర ప్రస్తావన కాని తాను చేయలేదని..తాను చెప్పినట్టుగా ఛార్జిషీటులో సీబీఐ పేర్కొన్న స్టేట్‌మెంట్‌లో అబద్ధాలే ఉన్నాయన్నారు.

దర్యాప్తును తప్పుదోవపట్టించే ధోరణి ఇందులో కనిపిస్తుందని.. కొంతమంది వ్యక్తులను ఇరికించే ప్రయత్నాల్లో భాగంగానే సీబీఐ ఇది చేస్తోందన్నారు.తన పిటిషన్ ను పరిగణలోకి తీసుకుని ఛార్జిషీటులో తన స్టేట్‌మెంట్‌గా పేర్కొన్న అంశాలను కొట్టిపారేయాలని హైకోర్టుకు విన్నవించారు.

ఈ రిట్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అజయ్ కల్లాం వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న సంగతి తెలిసిందే. 2023 ఏప్రిల్ 9న సీబీఐ తన స్టేటమ్‌మెంట్ రికార్డు చేసిందని అజయ్ అంటున్నారు.

వివేకా హత్య కేసు వ్యవహారంలో సీబీఐ ఎస్పీ తనను కలిసి వివరాలు తీసుకున్నారని అజయ్ కల్లాం గతంలో చెప్పారు. చిట్ చాట్ అని చెప్పి సీబీఐ తన నుంచి కొన్ని వివరాలు తీసుకుందని.. తాను చెప్పిన వివరాలతో సీబీఐ రూపొందించిన 161 స్టేట్ మెంట్‌‌కు ఎలాంటి విలువ లేదన్నారు..అది కేవలం సమాచారంగా మాత్రమే సీబీఐ సేకరించిందని చెప్పారు.

తాము 2019 మార్చి 15న మేనిఫెస్టో సమావేశంలో ఉండగా వివేకా ‘నోమోర్’ అన్న విషయం మాత్రమే తనకు తెలిసిందన్నారు. వివేకా ఎలా చనిపోయారన్న వివరాలను తానేమీ సీబీఐకి చెప్పలేదన్నారు.

తాను ఆ వివరాలు ఏమీ చెప్పకపోయినా సీబీఐ చేసేది ఏమీ లేదన్నారు. సీబీఐ చార్జ్‌షీటులో తాను చెప్పిన విషయాలను మార్చేసినట్లు అజయ్ కల్లాం ఆరోపిస్తున్నారు.

Primary Sidebar

Breaking: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా

Breaking: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా

Donald Trump

Donald Trump: అవును అతను మోసం చేశాడు…తేల్చిచెప్పిన న్యూయార్క్ జడ్జ్

ind vs aus third match

 ind vs aus: భారత్-ఆస్ట్రేలియా మూడవ వన్డే…టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

Khairatabad Ganesh: రేపు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర సాగేది ఎలాగంటే..?

Khairatabad Ganesh: రేపు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర సాగేది ఎలాగంటే..?

lokesh: ఏపీ హైకోర్టులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్

lokesh: ఏపీ హైకోర్టులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్

Chandrababu Case: ఉండవల్లి రిట్ పిటిషన్ మరో బెంచ్ కు బదిలీ

Chandrababu Case: ఉండవల్లి రిట్ పిటిషన్ మరో బెంచ్ కు బదిలీ

BSNL కస్టమర్లకు గుడ్ న్యూస్..600జీబీ డేటా.. ఏడాదిపాటు ఫ్రీ కాలింగ్..ఈ బెస్ట్ ప్లాన్ పై ఓ లుక్కేయండి..!!

BSNL కస్టమర్లకు గుడ్ న్యూస్..600జీబీ డేటా.. ఏడాదిపాటు ఫ్రీ కాలింగ్..ఈ బెస్ట్ ప్లాన్ పై ఓ లుక్కేయండి..!!

Malla Reddy: మల్కాజ్‌గిరిలో మైనంపల్లి వర్సెస్ మల్లారెడ్డి

Malla Reddy: మల్కాజ్‌గిరిలో మైనంపల్లి వర్సెస్ మల్లారెడ్డి

Footer

Copyright © 2023 · Rayudu Vision Media Limited | Technology Powered by CultNerds
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap
RTV News provides latest Telugu Breaking News, Political News
Telangana & AP News headlines Live, Latest Telugu News Online