విశాఖపట్నంలో మరో దందా వెలుగులోకి వచ్చింది. రూ. 90 లక్షల 500 నోట్లు ఇస్తే కోటి రూపాయల 2000 నోట్లు ఇస్తామని ఇద్దరు రిటైర్డ్ నేవల్ ఆఫీసర్లను ఓ ముఠా మోసం చేసింది. ముఠాకు ఏఆర్ సీఐ స్వర్ణలత నాయకత్వం వహించారు. ప్రస్తుతం హోమ్ గార్డ్స్ సీఐగా స్వర్ణలత పనిచేస్తున్నారు. రూ. 90 లక్షల్లో సీఐ స్వర్ణలత రూ. 20 లక్షలు నొక్కేశారు. సీఐ స్వర్ణలత తన సిబ్బంది చేత బాధితులను బెదిరించి కొట్టి పంపేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలిగా స్వర్ణలత ఉన్నారు. రిటైర్డ్ నేవల్ ఆఫీసర్స్ కొల్లి శ్రీను, శ్రీధర్ పోలీసులను ఆశ్రయించారు.
విశాఖలో వెలుగు చూసిన సీఐ స్వర్ణలత దందా
దేశంలో మోసగాళ్లు ఎక్కువైపోయారు. ఈజీగా డబ్బులు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. అమాయకులు, అత్యాశపరులే వారి టార్గెట్. ఎక్కువ మనీ ఆశ చూపించి అడ్డంగా దోచేస్తున్నారు. మోసపోయామని బాధితులు తెలుసుకునేలోపే డబ్బుతో డాయిస్తున్నారు. పక్క వాళ్ల దగ్గర డబ్బులు ఉన్నాయి అనే సమాచారం తెలిస్తే చాలు. ఆ డబ్బులను దండుకోవడానికి అనేక మాయోపాయాలు చేస్తున్నారు.
Translate this News: