తాజాగా.. పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తల ఆధారంగా పవన్పై కేసు నమోదుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే పవన్ చిక్కుల్లో పడటానికి కారణం… జులై 9న పవన్ మాట్లాడుతూ… ఏపీలో 29వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని, వీరిలో కొంతమందిని మాత్రమే గుర్తించారని, మిగతా వారు ఏమయ్యారో తెలియదన్నారు. వాలంటీర్లు సేకరించిన సమాచారం సంఘవిద్రోహ శక్తుల చేతుల్లోకి వెళుతోందన్నారు.
పూర్తిగా చదవండి..పవన్ కల్యాణ్పై పలు కేసులు, ఏయే సెక్షన్ల కింద అంటే?
ఏపీ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ని విచారణకు ప్రభుత్వం అనుమతించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు సచివాలయ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. వారాహి యాత్రలో భాగంగా.. జనసేనాని వాలంటీర్ల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై గత కొన్నిరోజులుగా అధికార పార్టీ నాయకులు, జనసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అంతేకాదు, పవన్ వ్యాఖ్యలపై ప్రభుత్వం కోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్లుగా వార్తలొచ్చాయి.
Translate this News: