తాజాగా.. పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తల ఆధారంగా పవన్పై కేసు నమోదుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే పవన్ చిక్కుల్లో పడటానికి కారణం... జులై 9న పవన్ మాట్లాడుతూ... ఏపీలో 29వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని, వీరిలో కొంతమందిని మాత్రమే గుర్తించారని, మిగతా వారు ఏమయ్యారో తెలియదన్నారు. వాలంటీర్లు సేకరించిన సమాచారం సంఘవిద్రోహ శక్తుల చేతుల్లోకి వెళుతోందన్నారు.
పలు సెక్షన్ల కింద కేసు నమోదు
పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఐసీపీ 199/4 ప్రకారం కేసు నమోదుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పవన్ పై పరువు నష్టం కేసులు పెట్టాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఆదేశిస్తూ గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు.పరువు నష్టం కేసులు పెట్టాలని చెప్పింది. గ్రామవార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ నుంచి ఈ ఆదేశాలు వచ్చాయి. పవన్ చేసిన వ్యాఖ్యలపై వివిధ పత్రికలు, మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా కేసులు నమోదు చేయాలని చెప్పింది. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు పంపారు.
విజయవాడలోని కృష్ణలంకలో కేసులు
ఏపీలో వారాహి విజయ యాత్ర నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్ వాలంటీర్లపై అనేక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఏపీలో మహిళలు అదృశ్యమవుతున్నారని పవన్ అన్నారు. వాలంటీర్లు డేటా సేకరిస్తున్నారని, అదంతా ఎవరికి చేరుతుందని ప్రశ్నించారు. ఇప్పటికే పవన్ పై కొన్ని పోలీస్ స్టేషన్లలో వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. వాలంటీర్ సురేశ్ ఇటీవల చేసిన ఫిర్యాదు మేరకు విజయవాడలోని కృష్ణలంక పోలీసులు సెక్షన్ 153, 153ఏ, 505(2) ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.