CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై మోదీకి వివరించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక సహాయం కోరనున్నారు. అనంతరం కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ను కలిసి పార్టీ వ్యవహారాలు చర్చించనున్నారు.
pm modi
Ukraine: భారత్లో జెలెన్స్కీ పర్యటన..
Zelenskyy India Tour: కిందట నెలలో భారత ప్రధాని మోదీ ఉక్రెయిన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ని భారత్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ ఏడాది చివర్లో ఇండియాలో పర్యటించనున్నారు. తేదీలు ఇంకా ఖరారు కానప్పటికీ జెలెన్స్కీ భారత్కు రావం గ్యారంటీ అని ఉక్రెయిన్ రాయబారి తెలిపారు. ఇప్పటికే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకుంటూ ఉక్రెయిన్లో ప్రధాని మోదీ పర్యటించారు. ఇప్పుడు ఆదేశ అధ్యక్షుడు కూడా ఇండియాకు వస్తే..మరో అడుగు ముందుకు పడినట్టు అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనపై చర్చించేందుకు ఇద్దరు నేతలకు ఇది గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది.. అని భారత్లోని ఉక్రెయిన్ రాయబారి ఒలెక్సాండర్ పోలిష్చుక్ అన్నారు.
1991లో సోవియట్ నుంచి విడిపోయి ఉక్రెయిన్గా ఏర్పడిన తర్వాత ఓ భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం మొన్నే మొదటిసారి. అంటే 33 ఏళ్ళ తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్ వెళ్ళారు. ఈ నేపథ్యంలో చర్చలు, దౌత్యమార్గాల్లో ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముగింపు వంటి విషయాల మీద ఇరు దేశాధినేతలూ చర్చించారు. రష్యా–ఉక్రెయిన్ మధ్య శాంతి స్థాపనకు ఇండియా అన్ని విధాలా సహకారం అందిస్తుందని..కృషి చేస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. యుద్ధం కంటే శాంతి వైపే తమ చూసు ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భారత్కు వస్తే ఈ విషయం మరోసారి చర్యలు జరిగే అవకాశంతో పాటూ… ఆదిశగా అడుగులు వేసే పరిణామాలు కూడా సంభవిస్తాయని ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయి.
PM Modi: ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. పారదర్శక కమ్యూనికేషన్కు పిలుపు
ప్రభుత్వ పాలనలో కమ్యూనికేషన్ ప్రాముఖ్యతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోకస్ పెట్టారు. ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని పొందడానికి దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవలే ప్రధాని మోదీ తమ పార్టీ మంత్రులు, ఉన్నతాధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు, సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయడంలో యాక్టీవ్గా ఉండాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై విపక్ష పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాలకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉందని భావించిన ఆయన ఈ సూచనలు చేశారు.
రాజకీయాల్లో ఒక అంశాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక అంశం ప్రజల అభిప్రాయంపై ప్రభావం చూపిస్తుంది. చూసే దృష్టికోణాన్ని మారుస్తుంది. చివరికి దీనివల్ల ఎన్నికల ఫలితాలు కూడా తారుమారు అవుతాయి. విపక్ష పార్టీలు తరచుగా.. ప్రభుత్వ విధానాలను సవాలు చేస్తుంటాయి. ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే కొత్త కోణాన్ని తీసుకొస్తుంటాయి. మోదీ ప్రభుత్వానికి ఇలాంటి విషయంలో ప్రజలకు కచ్చితమైన సమాచారం చేరుతుందని నిర్దారించుకోవడం కేవలం తమ రికార్డులను కాపాడుకోవడం మాత్రమే కాదు. ప్రజల్లో నమ్మకాన్ని, విశ్వసనీయతను కాపాడుకోవడం కూడా. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో.. విపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీపై వ్యతిరేక ప్రచారాలు చేసింది. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు ఓటు వేసే వారిలో భయాన్ని, సందేహాన్ని సృష్టించడానికే. అయినప్పటికీ బీజేపీ ఈ ఆరోపణలను బలంగా ఖండించింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ప్రధాని మోదీ కూడా ఖండించారు. తమకు రాజ్యాంగంలో మార్పులు చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని కూడా ఆయన పార్టీ సభ్యులకు సూచనలు చేశారు.
Also Read: హర్యానా ఎన్నికలు.. 20 సీట్లు ఇవ్వాలని ఆప్ డిమాండ్
బీజేపీ ప్రభుత్వం సమాజంలో విభేదాలు సృష్టిస్తోందని..ముఖ్యంగా ముస్లింలను టార్గెట్ చేస్తోందంటూ విపక్ష పార్టీలు ఇలాంటి ఆరోపణలు కూడా చేశాయి. బీజేపీ వల్ల ముస్లింల సంక్షేమానికి ముప్పు ఉంటుందనేలా చిత్రీకరించి మైనార్టీ ఓట్లు పడకుండా చేసేందుకే ఇలాంటి ఆరోపణలు చేశాయి. అయినప్పటికీ కూడా బీజేపీ ఈ విషయంలో విపక్షాలకు కౌంటర్ ఇచ్చింది. సబ్కా సాత్, సబ్కా వికాస్ అనే నినాదంతో సమష్టి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామనే నిబద్ధతను చూపించింది. ప్రభుత్వ పథకాలు అనేవి మతం, కమ్యూనిటీ అనే బేధాలు లేకుండా ప్రజలందరి ప్రయోజనాల కోసం రూపొందించామని ప్రధాని మోదీ కూడా పదేపదే చెప్పారు. మరోవైపు విపక్షాలు భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందనే ఆరోపణలు కూడా చేశాయి. అయినప్పటికీ మోదీ సర్కార్.. ఎలాంటి ఆక్రమణ జరగలేదని విపక్ష ఆరోపణలను తిప్పికొట్టింది. అలాగే భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.
Also Read: నకిలీ స్కూళ్లే టార్గెట్.. 27 పాఠశాలలపై సీబీఎస్ఈ ఆకస్మిక తనిఖీలు
ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ప్రధాని మోదీ.. మంత్రులకు ఉన్నతాధికారులకు కమ్యూనికేషన్ ప్రాధన్యత గురించి వివరించారు. ప్రభుత్వం చర్యలు, విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కృషి చేయాలని కోరారు. ఇది కేవలం విపక్షాలు చేసే అసత్యాలను కౌంటర్ చేయడానికి మాత్రమే కాదు.. ప్రభుత్వంలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి కూడా. ఈ నేపథ్యంలోనే మోదీ ప్రభుత్వం తాము చేసే పనులు, విధానాలను ఎక్కువమందికి చేరవేసే చర్యలను మరింత మెరుగుపర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. తప్పుడు సమాచారం తొందరగా వ్యాప్తి చెందుతున్న ఈ కాలంలో ప్రభుత్వానికి సంబంధించిన విధానాలు, సాధించిన విజయాలు ప్రజలకు సరైన సమయంలో చేరడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలోనే ఇలాంటి యాక్టివ్ కమ్యూనికేషన్ విధానాన్ని వ్యూహాత్మకంగా అమలు చేయడం ముఖ్యమని ప్రధాని మోదీ భావిస్తున్నారు.
PM Modi: సీఎం రేవంత్ను అభినందించిన మోదీ.. హెలికాప్టర్లు పంపిస్తామని హామీ!
TG News: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని, తక్షణ సహాయక చర్యలు చేపట్టామని రేవంత్ చెప్పారు. ఖమ్మంలో ఎక్కువగా నష్టం సంభవించిందని రేవంత్ తెలిపారు. దీంతో కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సేవలు అందించేందుకు హెలికాప్టర్లు తెలంగాణకు పంపిస్తామని మోదీ చెప్పారు. ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించిన తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగాన్ని మోదీ అభినందించారు.
PM Modi: సీఎం చంద్రబాబుకు పీఎం మోదీ ఫోన్.. వరద సహాయంపై కీలక హామీ!
AP News: ఏపీలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వపరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఇక వరద సహాయ చర్యలపై ప్రధానికి చంద్రబాబు వివరించగా.. కేంద్ర ప్రభుత్వంలోని ఆయా శాఖలకు ఆదేశాలు ఇచ్చామని, రాష్ట్రానికి అవసరమైన సహాయం చేయాలని ఆదేశించానని మోదీ తెలిపారు. తక్షణమే ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి అవసరమైన సామాగ్రి పంపేందుకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. కేంద్ర సహాయంపై ప్రధానికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
PM Modi: ప్రధాని మోదీపై ప్రశంసలు.. వేదికపై ఏం చేశారంటే
మహాత్మాగాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాధించడమే లక్ష్యంగా 2014లో దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని పట్టణాల్లో పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ, అలాగే గ్రామాల్లో, కేంద్ర తాగునీరు పారిశుద్ధ్య మంత్రిత్వశాఖ అమలు చేస్తుంది. మన ఇంటిని, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మిషన్కు ప్రజల నుంచి విశేష ఆధరణ దక్కింది. ఇప్పటికీ ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు అమలవుతునే ఉన్నాయి. అయితే తాజాగా ప్రధాని మోదీ ఓ ఈవెంట్లో చేసిన పనికి సోషల్ మీడియాలో ఆయనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: లావోస్లో సైబర్ స్కామ్ సెంటర్లు.. 47 మంది భారతీయులకు విముక్తి
ఇక వివరాల్లోకి వెళ్తే.. సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవం సందర్భంగా న్యూ ఢిల్లీలో నిర్వహించిన నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జ్యూడీషియరీ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రత్యేక స్మారక స్టాంప్ను, నాణేన్ని ఆవిష్కరించారు. ఈ సమయంలో దానికి సంబంధించిన రిబ్బన్ను విప్పిన తర్వాత దాన్ని కింద పడయలేదు, అలాగే అక్కడున్న వారికి ఇవ్వలేదు. ఆ రిబ్బన్ను ప్రధాని మోదీ తన జేబులోనే పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే కదా స్వచ్ఛ భారత్కు నిదర్శనం అని ప్రధాని మోదీని పొగుడుతూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ పట్ల ఆయనకున్న నిబద్ధతను కొనియాడుతున్నారు.
Also Read: అలెర్ట్.. మళ్లీ విజృంభిస్తున్న కరోనా కేసులు
PM Modi leading by example.
Notice how PM Modi didn’t throw the Ribbon or give it to someone else. He put it in his Pocket.
Swachh Bharat… pic.twitter.com/zfoKQptFes
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) August 31, 2024