టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో హింసను సృష్టించాలని చూస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గూండాలకు డాన్లా వ్యవహరిస్తోన్నారని ఆరోపించారు. శుక్రవారం చిత్తూరు జిల్లా పుంగనూరులో చంద్రబాబు పాత సినిమాల్లో బందిపోటులా దాడి చేయించారన్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ తిరిగే బాబు.. పుంగనూరులో 40 సంవత్సరాల రౌడీయిజాన్ని చూపించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పుంగనూరు ఘటన రాష్ట్రంలో ఒక్క బ్లాక్ డేగా నిలిచిపోనుందన్నారు.
పూర్తిగా చదవండి..పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాను శాసిస్తున్నారన్నారు..
పుంగనూరు హింసపై రాజకీయ రగడ కొనసాగుతోంది. వైసీపీ నేతలు చంద్రబాబును చిత్తూరు రాకుండా అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కల్గించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసే ఈ దారుణానికి పాల్పడ్డారని విమర్శించారు.
Translate this News: