TG News: ప్రస్తుత కాలంలో బంధానికి, బంధుత్వాలకి విలువ లేకుండా పోయింది. డబ్బుల కోసం కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. సొంతవాళ్లనే చంపి ప్రాణాలే తీసి మట్టిలో కలిపేస్తున్నారు. ఇలాంటి మరో దారుణ ఘటన తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలో ఓ ప్రైవేట్ హాస్టల్ని శ్రీకాంత్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. అదే హాస్టల్లో ఉంటూ శ్రీకాంత్ బామ్మర్ది యశ్వంత్ జాబ్ సెర్చింగ్ చేస్తున్నాడు. కొంతకాలంగా అప్పుల ఊబిలో చిక్కుకున్న శ్రీకాంత్.. బామ్మర్ది యశ్వంత్ ఆస్తిపై కన్నేశాడు. ఈ క్రమంలో సుపారి ఇచ్చి శ్రీకాంత్ ను హత్య చేయించాడు.
అంతటితో ఆగకుండా ఉద్యోగం రావడంలేదని మనస్థాపంతో ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించాడు. అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని నెల్లూరు జిల్లా కావలికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే.. యశ్వంత్ మృతిపై అతని తండ్రికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో బామ్మర్దిని హత్య చేసినట్లు బావ శ్రీకాంత్ ఒప్పుకున్నాడు. అనంతరం శ్రీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సుఫారీ తీసుకున్న ఇద్దరు పరారీలో ఉండగా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.