కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏపీ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మాజీ సీఎం, వైసీపీ ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. కేంద్రం ఇచ్చిన రూ.15 వేల కోట్లు దేనికి సరిపోవని అన్నారు. ఏఏపీలో ప్రభుత్వ పాలను వ్యతిరేకంగా బుధవారం ఢిల్లీలో వైఎస్ జగన్.. తన పార్టీ నేతలతో కలిసి ధర్నా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ కేంద్రం ఇచ్చే రూ.15 వేల కోట్లు దేనికి సరిపోవు. ఏపీకి రూ.లక్షా యాభై వేల కోట్లు కావాలి. టీడీపీ ఇచ్చిన హామీల్లో ఏవీ అమలు చేయలేరు. లోకేష్ రెడ్బుక్ పోస్టర్లతోనే వాళ్ల ఉద్దేశం స్పష్టంగా తెలిసింది.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: రూ.15 వేల కోట్లు దేనికి సరిపోవు.. మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
కేంద్రం ఇచ్చే రూ.15 వేల కోట్లు దేనికి సరిపోవని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏపీకి రూ.లక్షా యాభై వేల కోట్లు కావాలని.. టీడీపీ ఇచ్చిన హామీల్లో ఏవీ అమలు చేయలేరని పేర్కొన్నారు. ఢిల్లీలో ధర్నా చేసిన తర్వాత ఆయన మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు.
Translate this News: