సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం 9 గంటల నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగనున్నట్లు ప్రకటించారు. అందవెల్లి పెద్దవాగు బ్రిడ్జి పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు. రేపు ఉదయం 9 గంటలలోగా అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోతే నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఈ బ్రిడ్జి మీదనే నిరాహార దీక్షకు కూర్చుంటానని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంట్రాక్టర్ కు సకాలంలో బిల్లు చెల్లించకపోవడంలో ఈ సమస్య ఉత్పన్నమైందన్నారు.
పూర్తిగా చదవండి..TS News: రేపటి నుంచి తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే నిరాహార దీక్ష.. ఎందుకో తెలుసా?
అందెవెల్లి పెద్దవాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందని సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు ఆరోపించారు. రేపు ఉదయం 9 గంటలలోగా అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోతే అదే బ్రిడ్జిపై నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటానని హెచ్చరించారు.
Translate this News: