ఈ మధ్య కాలంలో లాకప్ డెత్లు ఆందోళన కలిగిస్తున్నాయి. నిందితులను జైలుకు తీసుకొచ్చి కొంతమంది పోలీసులు కర్కశంగా ప్రవర్తిస్తూ వారిని చావబాతున్నారు. దీనివల్ల వారు దెబ్బలకు ఓర్చుకోలేక చనిపోతున్న ఘటనలు ఇటీవల వెలుగుచూశాయి. అయితే ఇప్పుడు తాజాగా నల్గొండ జిల్లాలోని దేవరకొండలో మరో లాకప్ డెత్ జరిగింది. ఆ స్టేషన్ ఎస్ఐ విచక్షణారహితంగా కొట్టడం వల్లే నిందితుడు మృతి చెందాడని.. అతడి బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం మేరకు ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండలం పాలెం తండాకు చెందిన ఇద్దరు అన్నదమ్ముల్ల మధ్య ఓ భూవివాదం తలెత్తింది. అయితే ఈ వివాదంలో ఎస్ఐ సతీష్ రెడ్డి తలదూర్చాడనే ఆరోపణలు వస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Telangana: దారుణం.. మరో లాకప్ డేత్.. ఎస్ఐ చంపాడంటున్న బంధువులు..
నల్గొండ జిల్లా దేవరకొండలో లాకప్ డెత్ జరగడం కలకలం రేపింది. ఓ భూవివాదం కేసులో అరెస్టైన సూర్య నాయక్ అనే నిందితుడ్ని ఎస్సై సతీష్ రెడ్డి చితకబాదాడంతోనే మృతి చెందాడని.. సూర్య నాయక్ బంధువులు ఆరోపిస్తున్నారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Translate this News: