Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసిన దరిమిలా.. తదనంతర ఘట్టం కూడా పర్తయ్యింది. అదేనండీ.. నామినేషన్ల పరిశీలన ప్రక్రియను పూర్తి చేశారు అధికారులు. తెలంగాణ(Telangana)లోని 119 నియోజకవర్గాల్లో 4,798 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. వీరిలో 608 మంది అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరించారు అధికారులు. నాగార్జునసాగర్(Nagarjuna Sagar)లో మాజీ మంత్రి కె.జానారెడ్డి, కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్, హుజూరాబాద్లో ఈటల రాజేందర్ భార్య జమున వేసిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల పరిశీలన పూర్తవగా.. నెల 15వ తేదీ వరకు నామినేషణ్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆ రోజు సాయంత్రంలోపు ఎన్నికల బరిలో ఎవరు ఉన్నారు.. ఎవరు తప్పుకున్నారు అనే అంశంపై, అభ్యర్థుల వివరాలపై క్లారిటీ వస్తుంది.
పూర్తిగా చదవండి..Telangana: తెలంగాణలో 608 నామినేషన్ల తిరస్కరణ..
తెలంగాణ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో 4,798 మంది అభ్యర్థులు నామినేషన్ల వేయగా.. 608 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గరైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
Translate this News: