వైసీపీ ప్రభుత్వానికి (YCRCP Government) ఇదే ఆఖరి దసరా అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. వచ్చే దసరాకు వైసీపీ నామ రూపాల్లేకుండా పోతుందని జోస్యం చెప్పారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. తిరుమల (TTD) ఈవో జగన్ ఏజెంట్ గా తయారయ్యారని ఆరోపించారు. అక్కడ వైసీపీ నాయకులకు వన్ పర్సెంట్ కమిషన్ వస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ మళ్ళీ గెలిస్తే అది 10 పర్సెంట్ కు పెరుగుతుందని ధ్వజమెత్తారు. హిందువులు అందరూ మేల్కోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వ రౌడియిజానికి పుంగనూరు ఘటన నిదర్శనమన్నారు. జగన్ పుంగనూరుని పెద్దిరెడ్డికి (Minister Peddireddy) రాసిచ్చేశాడా? అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Chandrababu:అది చంద్రబాబు రాసినది కాదు..జైలు అధికారి ఎస్.రాహుల్
AP Politics: వైసీపీ సర్కార్ కు ఇదే ఆఖరి దసరా.. టీటీడీ ఈవో జగన్ ఏజెంట్: బీజేపీ నేత సంచలన వాఖ్యలు
బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు వైసీపీ సర్కార్ పై సంచలన వాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వానికి ఇదే ఆఖరి దసరా అంటూ ధ్వజమెత్తారు. తిరుమల ఈవో జగన్ ఏజెంట్ గా మారాడని తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ విశాఖకు మారడం.. దోచుకోవడానికేనంటూ ధ్వజమెత్తారు.
Translate this News: