Nayab Singh Saini: హర్యానాలో బీజేపీ ప్రభుత్వం కూలిపోబోతోందని జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు సీఎం నయాబ్ సింగ్ సైనీ. తమ ప్రభుత్వానికి ఎటువంటి ముప్పు లేదని అన్నారు. బలపరీక్షలో తమకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉండబోతుందని ధీమా వ్యక్తం చేశారు. హర్యానాలో ఎగిరేది కాషాయ జెండానే అని అన్నారు. సైనీ ప్రభుత్వానికి ఇకపై సభలో మెజారిటీ రానందున బలపరీక్ష కోరాలని గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ రాసినట్లు జననాయక్ జనతా పార్టీ (జెజెపి) చీఫ్ దుష్యంత్ చౌతాలా ప్రకటించిన కొన్ని గంటల తర్వాత సైనీ ఈ ప్రకటన చేశారు.
పూర్తిగా చదవండి..Nayab Singh Saini: బలపరీక్షకు సిద్ధం.. అధికారంలో ఉండేది బీజేపీనే.. సీఎం నయాబ్ సింగ్ సైనీ ధీమా
తాము బలపరీక్షకు సిద్ధమని అన్నారు హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ. హర్యానాలో బీజేపీ ప్రభుత్వం కూలిపోబోతోందని జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. తమకు ఎలాంటి భయం లేదని.. హర్యానాలో ఎగిరేది కాషాయ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు.
Translate this News: