Sexual assaults: అది అర్ధరాత్రి రెండు గంటల సమయం.. ఓ ఐదేళ్ల చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి గాఢ నిద్రలో ఉంది. కట్ చేస్తే.. తెల్లవారు జామున ఓ ఫామాయిల్ తోటలో జీవచ్చేవంలా పడి ఉంది. ఎప్పుడూ ఇంట్లో గల గల మాటాడుతూ ఉండే అల్లరిపిల్ల.. ఒక్కసారిగా అలా పడి ఉండటం చూసి ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. తీరా దీనిపై ఆరా తీస్తే.. పక్కింట్లో బాబాయి వరస అయ్యే ఓ కామాంధుడు ఆ పసికందును.. నిద్రలో ఉండగానే పొలాల్లోకి తీసుకెళ్లి అత్యంత క్రూరంగా అత్యాచారం చేశాడు. ఇది కేవలం ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటన మాత్రమే. ఇలాంటివి దేశంలో ప్రతిరోజు లెక్కకు మించి జరుగుతూనే ఉన్నాయి. అసలు రేప్ చేయాలనే ఆలోచన మగాళ్లకు ఎందుకు వస్తుంది? అత్యాచారాలకు పాల్పడేవారి ఆలోచనలు ఎలా ఉంటాయి?
7ఏళ్ల బాలికపై 17 ఏళ్ల బాలుడు..
ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎక్కడ చూసినా లైంగిక దాడులు, అత్యాచార ఘటనలే కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీలో పని చేస్తున్న ఇద్దరు యువకులు.. అదే కంపెనీలో పని చేస్తున్న యువతిని క్రూరాతి క్రూరంగా, చిత్రహింసలు పెట్టి రేప్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్లో జరిగింది. అటు టీవీ చూద్దామని పిలిచి ఏడేళ్ల బాలికను 17 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసిన ఘటన కూడా భాగ్యనగరంలోనే జరిగింది. అటు ఏలూరు జిల్లా స్వామి దయానంద సరస్వతి హాస్టల్లో విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కీచకుడు. అందులో పనిచేసే వార్డెన్ భర్త శశికుమార్ స్టూడెంట్స్ టార్గెట్ చేస్తూ అత్యాచారాలు చేస్తున్నాడు.
పేరున్న ప్రముఖులు సైతం రేపులు..
మరోవైపు ఇలా కూలినాలీ చేసుకునే వారే కాదు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవారు కూడా లైంగిక దాడులకు బలైపోతున్నారు. ముఖ్యంగా వర్క్ప్లేస్లో ఉండే వారిపై జరుగుతున్న లైంగిక దాడుల ఘటనలు పెరిగిపోతున్నాయి. అటు సినీ ఫీల్డ్లో ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతుంటాయి. తాజాగా జానీ మాస్టర్ ఎపిసోడ్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. తనపై అనేకసార్లు జానీ మాస్టర్ లైంగికదాడికి యత్నించాడని, మతాన్ని కూడా మార్చుకోవాలని వేధించాడని తోటి కోరియోగ్రాఫరే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా దాదాపు ప్రతీచోటా ఆడవాళ్లకు రక్షణ లేకుండాపోయింది.
పరిశోధనలు ఏం చెబుతున్నాయి..
అసలు మగవాళ్లు అత్యాచారాలు ఎందుకు చేస్తారన్నదానిపై అనేక పరిశోధనలు జరిగాయి. చాలా రీసెర్చ్ల్లో తెలిందేంటో తెలుసా? వీళ్లెవ్వరికీ కూడా సమ్మతి.. అంటే కన్సెంట్ అంటే ఏంటో కూడా తెలీదు. ఒక్కమాటలో చెప్పాలంటే అసలు రేప్కు అర్థమే తెలీదు. వారి దృష్టిలో వారు చేసింది తప్పే కాదు.. ఎందుకంటే ఒక అమ్మాయితో శృంగారంలో కలవాలంటే ఆమె సమ్మతి తీసుకోవాల్సిందే.. అలా తీసుకోకుండా చేసే ఏదైనా కూడా అది రేప్ కిందకే వస్తుంది.
రేపిస్టులను సమాజమే తయరుచేస్తోందా..
రేపిస్టులు ఎక్కడో ఉండరు.. మన సమాజం నుంచే పుట్టుకొస్తారు. మన సంప్రదాయాల చుట్టూ ఉన్న స్త్రీ వివక్ష కూడా ఇలాంటి అత్యాచార ఆలోచనల వెనుక ఒక ప్రధాన కారణం. మన సమాజంలో స్త్రీల పట్ల ఉన్న సాంప్రదాయ భావాలు, వారి మీద ఉన్న ఆంక్షలు, వారిని అణచివేయడానికి పూనుకునే పద్ధతులు.. ఇవన్నీ కూడా ఇలాంటి క్రూరమైన ఆలోచనలో వెనుక ఉన్న కారణాలే!
ఎన్ని రేపులు జరిగాయంటే..
నిర్మల్లోని మంజులాపూర్లో ఇంట్లో ఒంటరిగా ఉన్న గృహిణిపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం చేశాడు. ఆ మహిళ కేకలు వేయగానే పక్కింటి వారు వచ్చేలోపు డెలివరీ బాయ్ పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు విఘ్నేశ్ను అరెస్టు చేశారు. కర్నూల్ ప్రకారం మండల పరిధిలోని షేక్ బడేమియా (60) అనే వృద్ధుడు 12 సంవత్సరాల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు తల్లి సోమవారం విఎం బంజర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందితమిళనాడు పూతలూర్లో 42 ఏళ్ల మహిళపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. పనులు ముగించుకుని తిరుగుప్రయాణంలో రాత్రి బస్టాండ్లో ఒంటరిగా ఉన్న ఆమెకు లిఫ్ట్ ఇస్తామని చెప్పి ప్రవీణ్, రాజ్కపూర్ అనే వ్యక్తులు అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ ఘాజిపుర్లో అమానుష ఘటన జరిగింది. అనారోగ్యంతో ఉన్న భర్తను ఇంటికి తీసుకెళ్తున్న మహిళపై అంబులెన్స్ డ్రైవర్, సహాయకుడు మార్గమధ్యలో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె కేకలు వేయడంతో రోడ్డుమీద దింపి వెళ్లారు. ఆక్సిజన్ లేక బాధితురాలి భర్త మరణించాడు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో హృదయ విదారక ఘటన జరిగింది. ఒక బ్యాంకు ఉద్యోగి భార్యపై ఆర్మీ జవాను అత్యాచారం చేయడమే కాకుండా ఆమె జననాంగంలో గ్లాస్ను చొప్పించి క్రూరంగా ప్రవర్తించాడు. దీనిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీహార్ రాష్ట్రంలో నర్సుపై అత్యాచార ఘటన సంచలనం రేపుతోంది. సమస్తిపూర్ జిల్లా గంగాపూర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సుపై అక్కడే పనిచేస్తున్న మగ డాక్టర్ నర్సుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునే క్రమంలో వైద్యుడి మర్మాంగం కోసేసింది నర్సు. సంగారెడ్డి జిల్లా భానూర్లో గత ఏడాది ఓ ఐదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడికి పోక్సో కోర్టు మరణ శిక్ష విధించింది. అలాగే బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.