హైదరాబాద్ లో వైభవంగా నిమజ్జన వేడుకలు
బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం-LIVE
Padi Koushik Reddy: నా హత్యకు రేవంత్ కుట్ర.. ఈటల నుంచి రూ.25 కోట్లు: కౌశిక్ రెడ్డి సంచలనం
తనను హత్య చేయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేశాడని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనను హత్య చేసే అవకాశం ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల కోసం చనిపోవడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. కానీ కాంప్రమైజ్ మాత్రం కానన్నారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.. పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి తానే పంపించానని నిన్న సీఎం చెప్పారన్నారు. స్వయంగా ఎమ్మెల్యే ఇంటిపై దాడికి పంపించామని సీఎం చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? అని ప్రశ్నించారు.
రేవంత్ పై కేసు పెట్టాలి..
తనను ఎందుకు హత్య చేయాలని అనుకుంటున్నారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. రాష్ట్రంలో సమస్యలపై మాట్లాడుతున్నందుకే తనపై దాడులు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పైకి తమ వాళ్లే వెళ్లారని సీఎం చెప్పినా.. డీజీపీ, హోం సెక్రటరీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ను కలిసే అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
సైబరాబాద్ సీపీ డైనమిక్ గా ఎందుకు పని చేయడం లేదని.. ఏసీపీ, సీఐపై చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎవరిని విడిచిపెట్టమన్నారు. ఒకరిని అరెస్టు చేసి మరొకరిని విడిచి పెట్టడం వీపు చింతపండు అయినట్లా? అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో నీ వీపు చింతపండు కాలేదా? అని రేవంత్ రెడ్డిని పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.
కాంగ్రెస్ లో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి తన ఇంటికి వాచ్చి కాళ్లు పట్టుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు కౌశిక్ రెడ్డి. తనను పీసీసీ చీఫ్ చేసేందుకు సహకరించాలని బతిమిలాడాడడన్నారు. రేవంత్ రెడ్డిని పీసీసీ ప్రేసిడెంట్ ను చేసింది తానేనన్నారు. రేవంత్ రెడ్డిని గద్దెదించే వరకు పోరాటం చేస్తానన్నారు. రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ దగ్గర రూ.25 కోట్లు తీసుకుని ఎమ్మెల్యేగా ఈటెల గెలుస్తారని చెప్పాడని సంచలన ఆరోపణలు చేశారు. అందుకే తాను బీఆర్ఎస్ లో చేరానన్నారు.
Ganesh Nimajjanam 2024: నిమజ్జనం సందర్భంగా 600 స్పెషల్ బస్సులు.. వారికి ఫ్రీ!
హైదరాబాద్ నిమజ్జన వేడుకలు, శోభాయాత్ర అంటేనే అందరికీ హైదరాబాద్ గుర్తుకు వస్తుంది. ఇక్కడ జరిగే శోభాయాత్రను చూసేందుకు నగరం నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుచి భక్తులు భారీగా తరలివస్తారు. అయితే.. శోభాయాత్ర నేపథ్యంలో రేపు హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. దీంతో సొంత వాహనంలో ట్యాంక్ బండ్ వద్దకు వెళ్లి నిమజ్జన వేడుకలను చూడడం చాలా కష్టం. ఒకవేళ కష్టపడి వెళ్లినా.. వాహనాలను పార్కింగ్ చేయడం చాలా రిస్క్ తో కూడుకున్న పని. అయితే.. భక్తుల కోసం TGSRTC, మెట్రో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెల 17న గణేష్ నిమజ్జనోత్సవం, శోభయాత్ర సందర్భంగా భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా #TGSRTC యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వినాయక నిమజ్జన వేళ ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలకు 600 స్పెషల్ బస్సులను సంస్థ న… pic.twitter.com/DmuXGTReCN
— VC Sajjanar – MD TGSRTC (@tgsrtcmdoffice) September 15, 2024
మైట్రో రైల్ సేవలను అర్థరాత్రి వరకు పొడిగించగా.. తాజాగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రకటించింది. GHMC పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15-30 బస్సులను నడపనున్నట్లు తెలిపింది. భక్తులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు. మహాలక్ష్మి ఫ్రీ బస్ స్కీమ్ సైతం ఈ బస్సుల్లో అందుబాటులో ఉంటుంది. మహిళలు తమ ఆధార్ కార్డును చూపించి ఆయా స్పెషల్ బస్సుల్లో ప్రయాణించవచ్చు.
HYDRA Ranganath: వారిపై కూడా కేసులు పెట్టబోతున్నాం.. రంగనాథ్ సంచలన కామెంట్స్!
ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఏళ్ల క్రితం ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్న వాళ్ల జోలికి ప్రస్తుతం తాము వెళ్లడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. చెరువులు, కుంటలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేసి వ్యాపారాలు చేస్తున్న వారే ప్రస్తుతం తమ టార్గెట్ అని అన్నారు. ఈ రోజు RTV అన్సెన్సార్డ్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. న్యాయవాదులు, జర్నలిస్టులు, వివిధ వర్గాల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. హైడ్రా కార్యకలాపాలపై వ్యక్తం అవుతున్న సందేహాలను RTV వేదికగా ఆయన నివృత్తి చేశారు. హైడ్రాకు చట్టబద్ధత లేదంటూ వస్తున్న విమర్శలను కొట్టిపారేశారు. హైడ్రా జీవో ద్వారా ఏర్పాటైందన్నారు. గతంలో ప్లానింగ్ కమిషన్, ఏసీబీ లాంటి సంస్థలు సైతం జీవో ద్వారానే ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు.
కొన్ని చోట్ల పేదలను ముందు పెట్టి కొందరు ఆక్రమణలు చేస్తున్నారనన్నారు. ఆ క్రమంలోనే వారి నివాసాలను తొలగించామన్నారు. రాంనగర్ నాలాపై చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని కోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఆ ఆదేశాలను తాము ఇప్పుడు అమలు చేశామన్నారు. సున్నం చెరువు ఆక్రమణల విషయంలోనూ ఇలానే చేశామన్నారు. చెరువులను కబ్జా చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని నిన్న హైకోర్టు వ్యాఖ్యానించడంపై సంతోషం వ్యక్తం చేశారు. తాము ఇప్పుడే పని ప్రారంభించామని.. రానున్న రోజుల్లో అవసరాలకు అనుగుణంగా హైడ్రా మరింత బలోపేతం అవుతుందన్నారు.
దుండిగల్ లో తాము ఇటీవల తాము చేపట్టిన కూల్చివేతలకు సంబంధించిన నిర్మాణలకు అనుమతులను గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇచ్చాడన్నారు. అది చెల్లదన్నారు. కొన్ని చోట్ల పాత డేట్లతో సర్పంచ్ లు అనుమతులు ఇచ్చినట్లు దొంగ పేపర్లు సృష్టిస్తున్నారన్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. చెరువులు, ఇతర ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టి వాటిని విక్రయించి.. అమాయక ప్రజలను మోసం చేస్తున్న బిల్డర్లపై సైతం కేసులు పెడతామన్నారు. రూల్స్ పాటించకుండా అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు నమోదు చేస్తున్నామని.. వారి వెనక రాజకీయ నాయకులు ఉన్నట్లు తేలితే వారిపై కూడా కేసులు నమోదవుతాయని స్పష్టం చేశారు.
కూల్చివేతలు రాత్రికి రాత్రే చేయమని.. దాని వెనుక చాలా బ్యాక్ గ్రౌండ్ వర్క్ ఉంటుందన్నారు. అన్ని కోణాల్లో వివరాలు సేకరించిన తర్వాతనే కూల్చివేతలు చేపడుతున్నామన్నారు. మాదాపూర్ లో ఓ చెరువు మొత్తాన్ని మాయం చేసి నిర్మాణాలు చేపట్టారన్నారు. ఇందుకు సంబంధించిన వివరాను శాటిలైట్ ఇమేజ్, పాత విలేజ్ మ్యాప్ లు తదితర మార్గాల ద్వారా సేకరిస్తున్నామన్నారు. హైడ్రాకు నోటీసులు ఇచ్చే అధికారం లేదన్నారు. ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీళ్లు తీసుకెళ్లే నాలాలను సైతం ఇష్టం వచ్చినట్లుగా డైవర్ట్ చేశారన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైతం సేకరిస్తున్నామన్నారు. రంగనాథ్ పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.