ఖైరతాబాద్ మహగణపతి నిమజ్జనం పూర్తయింది. ట్యాంక్ బండ్ క్రేన్ నంబర్-4 వద్దు మహాగణపతి నిమజ్జనం నిర్వహించారు. గంగ ఒడికి మహాగణపతి చేరే సమయంలో భక్తులు కేరింతలు కొట్టారు. గణేశ్ మహరాజ్ కు జై అంటూ నినాదాలు చేస్తూ వినాయకుడికి వీడ్కోలు పలికారు.
TG Government: రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రాణి కుముదిని.. సర్కార్ కీలక ఉత్తర్వులు!
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాణి కుముదినిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం పార్థసారధిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించగా.. ఆయన పదవీకాలం ఇటీవలే ముగిసింది. మరికొన్ని రోజుల్లో ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తారన్న ప్రచార సాగింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కొత్త వారినే ఆ పదవిలో నియమించాలని భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి అయిన రాణి కుముదిని నియామకం జరిగింది. కుమిదిని 1988 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆమె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పని చేశారు.
Smt. I Rani Kumudini, I.A.S (Retired) appointed as the State Election Commissioner, Telangana for a period of three years from the date of assumption of office. She served as special chief secretary to the government of Telangana before retirement.#telangana… pic.twitter.com/Zat4TMaUiO
— V Chandramouli (@VChandramouli6) September 17, 2024
కేంద్ర సర్వీసుల అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమెను కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అయితే.. 2023 ఎన్నికలకు ముందు ఆమె పదవీ విరమణ చేశారు. గత కేసీఆర్ సర్కార్ ఆమెను అదే హోదాలో కొనసాగించింది. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఆమెకు అత్యంత కీలకమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బాధ్యతను అప్పగించింది. మూడేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. తెలంగాణలో మరికొన్ని నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ తదితర స్థానిక ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల నిర్వహణ కొత్త కమిషనర్ కు ఛాలెంజ్ గా మారనుంది.
నిమిషంలో తెలంగాణ వార్తలు
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశీ
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశీ ఎంపికయ్యారు. ఈ రోజు నిర్వహించిన శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఆమెవైపే మొగ్గు చూపారు. ఆతిశీ మర్లెనా సింగ్ ప్రస్తుతం విద్యాశాఖ, దివ్యాంగుల శాఖకు మంత్రిగా ఉన్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అయిన ఆతిషి.. ఢిల్లీలోని పాఠశాలల విద్యా పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆమె ఎంతో కృషి చేశారు. లిక్కర్ కేసులో మనీశ్ సిసోడియా అరెస్టయిన అనంతరం అతిషి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కేజ్రీవాల్, సిసోడియా జైల్లో ఉన్నప్పుడు.. పార్టీ బాధ్యతలు తీసున్నారు.
మరో విషయం ఏంటంటే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమానికి ఆతిషియే జాతీ జెండా ఎగురవేయాలని కేజ్రీవాల్ సూచించారు.దీన్ని పరిశీలిస్తే కేజ్రీవాల్ కు ఆమెపై ఎంత నమ్మకం ఉందే అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఈ రోజు సాయంత్రం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. లెఫ్ట్ నెంట్ గవర్నర్ ను కలిసి ఆయన తన రాజీనామాను సమర్పించనున్నారు.అనంతరం కొత్త సీఎంతో లెఫ్ట్ నెంట్ గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది.
Delhi CM Arvind Kejriwal proposes the name of Delhi Minister Atishi as the new Chief Minister. She has been elected as the leader of Delhi AAP Legislative Party: AAP Sources pic.twitter.com/65VPmPpA39
— ANI (@ANI) September 17, 2024