తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలయ్యిందనే చెప్పాలి. ఇక్కడి అధికార బీఆర్ఎస్ పార్టీ తన పార్టీ అభ్యర్ధలు జాబితాను విడుదల చేసేయడంతో కాంగ్రెస్, బీజెపీలు సైతం క్యాండిడేట్ల లిస్ట్ మీద కసరత్తులు ప్రారంభించాయి. ఇందులో భాగంగానే ఈరోజు ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ అయింది. ఈ కమిటీ సమావేశంలో ఛైర్మన్ మురళీధరన్, సభ్యులు జిగ్నేష్ మేవానీ, సిద్ధిఖి, ఎక్స్ అఫిషియో సభ్యులుగా రాష్ట్ర ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. 35 నియోజకవర్గాలకు ఒక్కొక్కరే దరఖాస్తు చేయడంతో వారినే ఫైనల్ చేయాలని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. లిస్టులో ఉన్న అభ్యర్థులనే ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల కమిటీకి ఫైనల్ చేసిన లిస్టును పంపి…ఈ నెలాఖరులోగా ఫస్ట్ లిస్ట్ విడుదల చేసే ఛాన్స్ ఉందని సమాచారం.
స్క్రీనింగ్ కమిటీ సింగిల్ నేమ్ తో కేంద్ర ఎన్నికల కమిటీ కి పంపే జాబితా:
——————————–
1. కొడంగల్ – రేవంత్ రెడ్డి
2. హుజూర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి 3.కోదాడ – పద్మావతి
4. మధిర – భట్టి విక్రమార్క
5. మంథని – శ్రీధర్ బాబు
6. జగిత్యాల – జీవన్ రెడ్డి
7. ములుగు – సీతక్క
8. భద్రాచలం – పొడెం వీరయ్య
9. సంగారెడ్డి – జగ్గారెడ్డి
10. నల్గొండ – కోమటిరెడ్డి వెంకటరెడ్డి
11. అలంపూర్ – సంపత్ కుమార్
12. నాగార్జునసాగర్ కుందూరు జైవీర్ రెడ్డి
13. కామారెడ్డి – షబ్బీర్ అలీ
14. పాలేరు – తుమ్మల నాగేశ్వరరావు
15. కొత్తగూడెం – పొంగులేటి శ్రీనివాసరెడ్డి
16. పరిగి – రామ్మోహన్ రెడ్డి
17. వికారాబాద్ – గడ్డం ప్రసాద్ కుమార్
18. మహేశ్వరం – చిగురింత పారిజాత
19. ఆలేరు – బీర్ల ఐలయ్య
20. ఖైరతాబాద్ – రోహిన్ రెడ్డి
21. దేవరకొండ – వడ్త్య రమేష్ నాయక్
22. వేముల వాడ – ఆది శ్రీనివాస్
23. ధర్మపురి – లక్ష్మణ్
24. జడ్చర్ల – అనిరుద్ రెడ్డి
25. హుజూరాబాద్ – బల్మూర్ వెంకట్
26. నాంపల్లి – ఫిరోజ్ ఖాన్
27. కోరుట్ల. జువ్వాడి నర్సింగ్ రావు
28.అచ్చంపేట – వంశీకృష్ణ
29 జహీరాబాద్ – ఏ. చంద్రశేఖర్
30. ఆందోల్ – దామోదర రాజనర్సింహ
31.మంచిర్యాల – ప్రేమ్ సాగర్ రావు
32. కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు
33. ఆదిలాబాద్ – కంది శ్రీనివాస్ రెడ్డి
34. వరంగల్ ఈస్ట్ – కొండా సురేఖ
35. భూపాల పల్లి – గండ్ర సత్యనారాయణ
ఇదిలా ఉండగా…ట్ గా హైదరాబాద్ లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశాల్లో… ఈ ఇయర్ ఎండ్ లో తెలంగాణతో సహా మరో నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాంగానే ఆరు గ్యారెంటీలను ప్రజల ముందుకు తీసుకువచ్చింది.