CM Mmatha and Junior doctors: కాళీఘాట్లో సాయంత్రం 5 గంటలకు జరగాల్సిన దీదీ మమతా బెనర్జీ, జూనియర్ డాక్టర్ల మధ్య నమావేశం రెండుగంటలు ఆసల్యంగా రాత్రి ఏడు గంటలకు ప్రారంభం అయింది. పోలీస్ ఎస్కార్ట్ వాహనంతో 30 మంది వైద్యులు సాయంత్రం 6:20 గంటలకు ముఖ్యమంత్రి నివాసానికి వచ్చారు. అంతకు ముందు ముఖ్యమంత్రితో జూడాలు నాలుగు సార్లు చర్చలకు నిరాకరించారు. కానీ ఎట్టకేలకు ఇవాళ దీదీతో చర్చలు జరిపారు జూడాలు. అంతకుముందు రెండు సార్లు సమావేశం దగరగకు కూడా రాలేదు డాక్టర్లు. మొదటి సమావేశంలో ముఖ్యమంత్రి కూర్చొని, వైద్యుల బృందం కోసం వేచి ఉన్న ఫొటో వైరల్ అయింది. కాళీఘాట్ ఇంటి లోపలికి వచ్చి కనీసం ఒక కప్పు టీ అయినా తాగమని డాక్టర్లను మమత కోరారు. కానీ డాక్టర్లు న్యాయం జరిగాకే టీ తాగుతామని చెప్పారు.
మొత్తానికి ఈరోజు జరిగిన సమావేశంలో ప్రభుత్వం, జూడాలు ఒక డిమాండ్ విషయంలో అయితే అంగీకారానికి వచ్చారని తెలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని జూనియర్ డాక్టర్లు చేసిన కీలక డిమాండ్ను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అంగీకరించిందని సమాచారం. అయితే లవ్ స్ట్రీమింగ్ డిమాండ్ను మాత్రం అంగీకరించలేదు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం, మీటింగ్ మినిట్స్ను వైద్యులతో పంచుకోవడానికి అంగీకరించింది. ఇక ఈ మీటింగ్లో మమతా బెనర్జీ మళ్లీ తమ సమ్మెను ఉపసంహరించుకుని విధుల్లోకి రావాలని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. వైద్యుల సమ్మె కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు.
Also Read: Telangana: అక్టోబర్ లో కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీ