ఇటీవల తన మీద జరిగిన దాడిపై ఆర్టీవీతో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. తెలంగాణలో ఎంగేజ్మెంట్ కార్యక్రమం కోసం వెళ్ళానని తెలిపారు. కారు ప్రమాదం జరిగింది కానీ ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. కానీ బస చేసిన హోటల్లో టీడీపీ కార్యకర్తలు తన మీద దాడి చేసే ప్రయత్నం చేశారని అంబటి చెప్పారు. నన్ను వేసేస్తాం… అంటూ పచ్చి బూతులు మాట్లాడారని చెప్పారు. చందాలు వేసుకుని తనను లేపేస్తాం.. అంటూ మాట్లాడారని మంత్రి తెలిపారు. గతంలో ఇదే ఖమ్మంలో ఒక సామాజిక వర్గం వారు మీటింగ్ పెట్టుకుని రూ.50 లక్షలు చందాలు వేసుకుని తన మీద దాడులు చేయాలని మాట్లాడారని ఆయన గుర్తు చేశారు.
పూర్తిగా చదవండి..AP Elections: ఇలాంటి దాడులకు భయపడను: అంబటి
నిన్న తెలంగాణలో తనపై జరిగిన యాక్సిడెంట్కు, తర్వాత జరిగిన దాడికి సంబంధం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు.
Translate this News: