Malayalam Movie Industry: జస్టిస్ హేమ కమిటీ నివేదిక బయటకు వచ్చాక మలయాళం ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు ఒక్కొక్కరే బయటకు వస్తున్నారు. వీరిలో హీరోయిన్లు కూడా ఉన్నారు. తమకు జరిగిన అన్యాయాలు, వేధింపుల మీద వారు గొంతు ధైర్యంగా గొంతు విప్పుతున్నారు. తాజాగా ఓ నటి మలయాళ హీరో నివిన్ పౌలీ మీద ఫియాదు చేశారు. తనకు అవకాశం ఇప్పిస్తానని చెప్పి దుబాయ్ తీసుకువెళ్ళి అక్కడ లైంగిక వేధింపులకు పాల్పడ్డరని ఆమె పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీని మీద ప్రాథమిక విచారణ చేసిన పోలీసులు నివిన్ పౌలీ సహా ఆరుగురిపై నాన్-బెయిలబుల్ కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఓ నిర్మాత కూడా ఉన్నాడు. నిందితుల జాబితాలో నివిన్ పౌలీని ఆరో వ్యక్తిగా చేర్చారు. ప్రస్తుతం ఇది కేరళ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది.
పూర్తిగా చదవండి..Kerala: మలయాళ నివిన్ పౌలిపై సెక్సువల్ అబ్యూజ్ కేసు
మలయాళం ఇండస్ట్రీని లైగింక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ పట్టి కుదిపేస్తున్నాయి. ఇప్పటికే నటులు సిద్ధిఖీ, జయసూర్య, దర్శకుడు రంజిత్లపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు తాజాగా ప్రేమమ్ హీరో నివిన్ పౌలీ మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదయింది.
Translate this News: