All Party Conference: బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అస్థిర పరిస్థితులను కేంద్రం నిశితంగా గమనిస్తోంది. ఈ క్రమంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. అక్కడి పరిణామాల గురించి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. పార్టీల నేతలకు వివరించారు. భారతీయుల్ని తరలించేంత ప్రమాదకరంగా అక్కడి పరిస్థితులు లేవని వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. భారతీయలను తరలించేంతగా బంగ్లాదేశ్లోని పరిస్థితులు ప్రమాదకరంగా లేవు. కానీ అక్కడి పరిస్థితుల్ని అత్యంత అప్రమత్తతతో గమనిస్తున్నాం. బంగ్లాదేశ్లో 12-13 వేల మంది భారతీయులున్నారు. పొరుగుదేశంలో ఉన్న మన ప్రజల భద్రత విషయమై అక్కడి ఆర్మీతో టచ్లో ఉన్నాం అని మంత్రి జైశంకర్ వెల్లడించారు. అలాగే ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాతో భారత ప్రభుత్వం మాట్లాడిందన్నారు. మానవత్వ చర్యలో భాగంగానే ఆమెకు భారత్లో ఆశ్రయం ఇచ్చామని చెప్పారు. భవిష్యత్పై నిర్ణయం తీసుకోవడానికి ఆమెకు కొంత సమయం కావాలని భావిస్తున్నామని తెలిపారు.
పూర్తిగా చదవండి..Delhi: అలర్ట్ గా ఉన్నాం.. బంగ్లాదేశ్ పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం
బంగ్లాదేశ్ పరిస్థితుల మీద అఖిల పక్షం సమవేశం జరిగింది. ఈ విషయంలో అలర్ట్గా ఉన్నామని ఈ సమాశంలో విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. బంగ్లాదేశ్ పరిస్థితులను నిత్యం పరిశీలిస్తున్నామని..ప్రజల భద్రత విషయమై ఆర్మీతో టచ్ లో ఉన్నామని చెప్పారు.
Translate this News: