కేరళలో నిఫా వైరస్ సోకిన 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలుడు మరణించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఆదివారం తెలిపారు. అతడికి వైరస్ సోకినట్లు నిర్ధరించిన కొన్ని గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. మళప్పురం జిల్లాలో 14 ఏళ్ల బాలుడికి నిఫా వైరస్ సోకినట్లు వీణా జార్జ్ శనివారం తెలిపారు. పూణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) ఈ విషయాన్ని నిర్ధరించినట్లు పేర్కొన్నారు. అతడికి ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారని.. వెంటిలేటర్పై ఉన్నట్లు పేర్కొ్న్నారు. ఇంతలోనే ఆదివారం ఉదయం బాలుడు మృతి చెందడం కలకలం రేపుతోంది.
పూర్తిగా చదవండి..Nipah Virus: నిఫా వైరస్ కలకలం.. 14 ఏళ్ల బాలుడు మృతి
కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ సోకిన 14 ఏళ్ల బాలుడు మరణించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఆదివారం తెలిపారు. అతడికి వైరస్ సోకినట్లు నిర్ధరించిన కొన్ని గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.
Translate this News: