Central Minister Kishan Reddy: మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ నినాదం వదిలేశారని, ఉద్యమ సెంటిమెంట్ తో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తెలంగాణకు తీరని శోకాన్ని మిగిల్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద వనివారం బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ మహాధర్నాకు ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి హాజరై మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించింది యువత అని, ఆత్మ బలిదానాలు, త్యాగాలు చేసింది వారేనని, తెలంగాణ సాధన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. కానీ తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ వాడుకుని వదిలేశారని ఆయన మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..Telangana: పైరవీకారులకే సచివాలయ ఎంట్రీ- కేంద్రమంత్రి కిషన్రెడ్డి
డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ నిలువునా మోసం చేస్తోందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం పోయి, సోనియా కుటుంబం వచ్చిందని..దీన్నే మార్పు అంటారా అంటూ ఆయన తెలంగాణ ప్రభుత్వం మీద మండిపడ్డారు. 8 నెలల్లోనే రేవంత్ సర్కార్ వంచనకు గురిచేస్తోందని ఆయన విమర్శించారు.
Translate this News: