పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చని అంశంలో గవర్నర్ రాధాకృష్ణన్ ను ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో రాజ్యాంగంపై జరుగుతున్న దాడి, ఇతర అంశాలను గవర్నర్ రాధాకృష్ణన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉన్న నాయకులంతా గవర్నర్ ను కలిశామన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఎలా తుంగలో తొక్కుతున్నదో వివరించామన్నారు. హామీలు అమలు చేయాలన్న విద్యార్థుల మీద నిర్భంధం, అణిచివేత, అరెస్ట్ లు, అక్రమ కేసులతో భయానక వాతావారణం పునరావృతం చేస్తున్నారని చెప్పామన్నారు. సిటీ సెంట్రల్ లైబ్రరీలో లాఠీ ఛార్జ్, ఓయూ విద్యార్థులపై దాడి చేస్తూ ఉద్యమ నాటి అణిచి వేత వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ప్రయోగిస్తుందని ఆయన దృష్టికి తెచ్చామన్నారు.
KTR: పరీక్షల వాయిదాతో రూ.400 కోట్లు.. అందులో రేవంత్ వాటా ఎంత?
పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు వందల కోట్లు లాభం వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గతంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు గ్రూప్-2 ను నాలుగు నెలలు వాయిదా వేశారని.. దీంతో రూ.400 కోట్లు వస్తున్నాయా? అందులో సీఎం వాటా ఎంత? అని ప్రశ్నించారు.
Translate this News: